ఇటీవల కాలంలో మనుషులకి పెంపుడు కుక్కలకి మధ్య బంధం బాగా బలపడుతుందని జంతువు ప్రేమికులు కూడా అంటూ ఉన్నారు. ఎందుకంటే ఇటీవల కాలంలో ఏ ఇంట్లో చూసినా ఒక అందమైన పెంపుడు కుక్క కనిపిస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. అయితే కొంతమంది ట్రెండ్ ఫాలో అవ్వడానికి మాత్రమే పెంపుడు కుక్కలను తెచ్చుకుంటున్నారు. కానీ ఆ తర్వాత కాలంలో ఇక వాటిని మచ్చిగ చేసుకుంటూ వాటితో ప్రేమలో పడిపోతూ ఉన్నారు అని చెప్పాలి. ఇక జంతు ప్రేమలకుల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ట్రెండు ఉన్నా లేకపోయినా తమకు ఇష్టమైన జంతువులను తెచ్చుకుని ఎంతో ప్రేమగా చూసుకోవడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక కొంతమంది అయితే ఏకంగా మనుషుల మీద చూపించిన ప్రేమ కంటే పెంపడంపు జంతువుల మీద చూపించే ప్రేమ కాస్త ఎక్కువగా ఉంటుంది అని చెప్పాలి.


 ఇదిలా ఉంటే కొన్ని ఘటనలు చూసిన తర్వాత కుక్కల మధ్య అటు బంధం బలపడటం ఏమో కానీ శత్రుత్వం మాత్రం మరింత పెరిగిపోతుందేమో అని అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవలే కాలంలో ఎన్నో ప్రాంతాల్లో వీధి కుక్కలు సృష్టిస్తున్న వీరంగం అంతా ఇంతా కాదు అని చెప్పాలి. ఏకంగా ఎంతో మందిని గాయపరచడమే కాదు ఇంకా ఎంతో మంది ప్రాణాలు పోవడానికి కూడా కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి. అయితే ఇక్కడ వెలుగులోకి వచ్చిన ఘటన మాత్రం ప్రతి ఒక్కరిని అవాక్కయ్యేలా చేస్తూ ఉంది. ముఖ్యంగా జంతువు ప్రేమికులందరికీ కోపం తెప్పిస్తుంది అని చెప్పాలి. ఇంతకీ ఏం జరిగిందంటే... ఏకంగా 25 కుక్కలను తుపాకీతో కాల్చి చంపారు అధికారులు.


 కుక్కలా కారణంగా ఎనిమిది మంది చనిపోయారట. ఈ ఘటన బీహార్ రాష్ట్రంలోని బెగుసరై జిల్లాలో వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి. అయితే ఇక కుక్కల కారణంగా ఎనిమిది మంది చనిపోవడమే కాదు 40 మంది గాయపడ్డారట. సమాచారం అందుకున్న అధికారులకు కుక్కలను చంపాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే అధికారులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గ్రామస్థుల సహకారంతో రెండు రోజుల వ్యవధిలో 25 కుక్కలను అధికారిక తుపాకీతో కాల్చి చంపినట్లు తెలుస్తుంది. అయితే ఆ ప్రాంతంలో కుక్కల కారణంగా కనీసం ఇంటి నుంచి బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది అన్నది తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: