ఇటీవల కాలంలో చిన్నచిన్న కారణాలకే మనుషులు చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఎంత పెద్ద సమస్య వచ్చినా సరే ధైర్యంగా నిలబడి సమస్యను ఎదుర్కొనేవారు మనుషులు. కానీ ఇప్పుడు నేటి సభ్య సమాజంలో మనుషుల్లో ఇలాంటి ధైర్యమే పూర్తిగా కనుమరుగైపోయింది అన్నది మాత్రం నేటి రోజుల్లో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూస్తూ ఉంటే అర్థమవుతుంది. ఎందుకంటే చిన్న చిన్న కారణాలకే దారుణంగా ప్రాణాలు తీసుకుంటున్నారు ఎంతోమంది.


 ఇక దేవుడు ఇచ్చిన విలువైన ప్రాణాలను చేజేతులారా తీసుకుంటున్న ఘటనలు వెలుగులోకి వస్తూ ఉన్నాయని చెప్పాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో భార్యాభర్తల బంధం అనేది ఇలా ప్రాణాలు పోవడానికి కారణమైంది. సాదరణంగా ఒకప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ కూడా కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడునీడుగా ఉండేవారు అనుకునేవారు. కానీ నేటి రోజుల్లో చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడం.. ఇక కొంతమంది విడాకులు తీసుకునేందుకు సిద్ధమవడం మరి కొంతమంది ఏకంగా కట్టుకున్న వారిని దారుణంగా హతమార్చేందుకు కూడా వెనకాడకపోవడం లాంటి ఘటనలు వెలుగుచూస్తున్నాయి.


 ఇటీవల బీహార్ లోని మాదాపూర్ లో అయితే మరో దారుణ ఘటన వెలుగు చూసింది. తన భార్య తన తో గొడవపడి పుట్టింటికి వెళ్లిందని.. మళ్లీ తిరిగి రావట్లేదు అని ఓ భర్త ఎంతగానో మనస్థాపం చెందాడు. ఈ క్రమం లోనే ఏకంగా మర్మంగాన్ని కోసుకున్నాడు భర్త. కృష్ణ బస్సు అనే వ్యక్తికి అనిత అనే యువతీ తో కొన్నేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వారికి నలుగురు సంతానం ఉన్నారు. అయితే కొన్ని రోజుల క్రితం తనతో గొడవ పడి పుట్టింటికి వెళ్ళిన భార్య తిరిగి రావడానికి లేట్ అయింది. దీంతో కోపం లో కృష్ణ తన మర్మాంగాన్ని కోసుకున్నాడు.  రక్తపు మడుగులో పడి ఉన్న కృష్ణను గమనించిన కుటుంబ సభ్యులు ఆసుపత్రికితరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: