అయితే ఇలా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి కలిసి జీవించలేం అనుకున్నప్పుడు కోర్టుకు చేరుకొని విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు హాయిగా గడిపిన పర్వాలేదు. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యాభర్తలు ఒకరి విషయంలో ఒకరు మరింత రాక్షసత్వంతో వ్యవహరిస్తూ ఉన్నారు. విడాకులు తీసుకొని విడిపోవడం కాదు కట్టుకున్న వారిని దారుణంగా కడతేరుస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. వెరసి ఈ ఘటనలు చూసిన తర్వాత పెళ్లి అంటేనే నేటి రోజుల్లో యువత భయపడిపోతున్నారు అని చెప్పాలి. ఇక ఇటీవల తమిళనాడులో ఇలాంటి దారుణ ఘటన జరిగింది.
భార్యపై పట్టరాని కోపాన్ని పెంచుకున్న భర్త చివరికి దారుణానికి పాల్పడ్డాడు. కడలూరు కు చెందిన భార్యాభర్తలు సద్గురు, ధనలక్ష్మి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భరత తీరుతో విసిగిపోయిన భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని సోదరి తమిళ రాసి ఇంటికి వెళ్ళింది. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన భర్త సద్గురు వాళ్ళ ఉన్న ఇంటికి వెళ్లి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కసారిగా మంటలు అంటుకొని తమిళ రాశి, సద్గురుతో పాటు ఇద్దరు పిల్లలు కూడా సజీవ దహనం అయ్యారు. ఈ ఘటనలో అటు ధనలక్ష్మి తీవ్ర గాయాలతో బయటపడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.