ప్రతి మనిషి జీవితంలో పెళ్లి అనేది ఒక భాగం అన్న విషయం తెలిసిందే. ఒంటరిగా సాగిపోతున్న జీవితానికి ఒక భాగస్వామిని జత చేసుకొని ముందుకు సాగడమే పెళ్లి. ఇక ఒకసారి దాంపత్య బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా కష్టసుఖాల్లో తోడునీడగా ఉంటూ ఒకరంటే ఒకరు ప్రాణంగా బ్రతకాలి. ఏకంగా అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ గా ఉండాలి అని చెప్పాలి.  కానీ నేటి రోజుల్లో భార్యాభర్తల బంధం లో ఇలాంటి అన్యోన్యత కనిపించడం లేదు. సర్దుకుపోయి బ్రతకడం కాదు.. చిన్నచిన్న మనస్పర్ధలతోనే తట్ట బుట్ట సర్దుకుని విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్న ఘటనలే నేటి రోజుల్లో వెలుగు చూస్తున్నాయి.


 అయితే ఇలా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి కలిసి జీవించలేం అనుకున్నప్పుడు కోర్టుకు చేరుకొని విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు హాయిగా గడిపిన పర్వాలేదు. కానీ నేటి రోజుల్లో మాత్రం భార్యాభర్తలు ఒకరి విషయంలో ఒకరు మరింత రాక్షసత్వంతో వ్యవహరిస్తూ ఉన్నారు. విడాకులు తీసుకొని విడిపోవడం కాదు కట్టుకున్న వారిని దారుణంగా కడతేరుస్తున్న ఘటనలు వెలుగు చూస్తూ ఉన్నాయి. వెరసి ఈ ఘటనలు చూసిన తర్వాత పెళ్లి అంటేనే నేటి రోజుల్లో యువత భయపడిపోతున్నారు అని చెప్పాలి.  ఇక ఇటీవల తమిళనాడులో ఇలాంటి దారుణ ఘటన జరిగింది.


 భార్యపై పట్టరాని కోపాన్ని పెంచుకున్న భర్త చివరికి దారుణానికి పాల్పడ్డాడు. కడలూరు కు చెందిన భార్యాభర్తలు సద్గురు, ధనలక్ష్మి మధ్య గత కొన్ని రోజుల నుంచి గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భరత తీరుతో విసిగిపోయిన భార్య తన ఇద్దరు పిల్లలను తీసుకొని సోదరి తమిళ రాసి ఇంటికి వెళ్ళింది. అయితే ఆగ్రహంతో ఊగిపోయిన భర్త సద్గురు వాళ్ళ ఉన్న ఇంటికి వెళ్లి భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించే ప్రయత్నం చేశాడు. అయితే ఒక్కసారిగా మంటలు అంటుకొని తమిళ రాశి, సద్గురుతో పాటు ఇద్దరు పిల్లలు కూడా సజీవ దహనం అయ్యారు.  ఈ ఘటనలో అటు ధనలక్ష్మి తీవ్ర గాయాలతో బయటపడి కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: