ప్రేమిస్తే జీవితాంతం సరిపోయే విజ్ఞాపకాలు దొరుకుతాయి ఇటీవల కాలంలో ఎంతోమంది చెబుతూ ఉంటారు. ఇక సినిమాల్లో కూడా ఇదే చూపిస్తూ ఉంటారు.  అయితే ఇదే నిజం అనుకుంటున్నా కాలేజీ పిల్లలు ఇక చదువులను పక్కన పెట్టేసి ప్రేమ దోమ అంటూ కాలేజీ ఎగ్గొట్టి తిరగడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక తర్వాత ఏకంగా ప్రేమను గెలిపించుకుంటాం. మేము నిజమైన ప్రేమికులం అంటూ చిన్న వయసులోనే పెద్ద పెద్ద మాటలు చెబుతూ చివరికి తెలిసి తెలియని వయసులో నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని దుర్భరంగా మార్చేసుకుంటున్నారు. ఇలాంటి తరహా ఘటనలు ఇటీవల కాలంలో చాలానే వెలుగులోకి వస్తూ ఉన్నాయి అని చెప్పాలి.


 ఒక ఉద్యోగం సాధించి జీవితంలో సెటిల్ అయిన తర్వాత ప్రేమ జోలికి వెళ్లడం కాదు. ఏకంగా స్కూల్ దశ నుంచి ప్రేమ దోమ అంటూ చెడుదారులు నడుస్తూ ఉన్నారు ఎంతో మంది విద్యార్థులు. ఈ క్రమంలోనే కొంతమంది ఇలా ప్రేమ అంటూ తిరుగుతూ ప్రాణాలు మీదికి తెచ్చుకుంటున్న ఘటనలు కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఎంతోమంది ప్రేమ అనే కారణంతో దారుణ హత్యలకు గురవుతున్నారు అని చెప్పాలి. మహారాష్ట్రలోని బోర్సర్ గ్రామంలో కూడా ఇలాంటి తరహా ఘటన వెలుగులోకి వచ్చింది అని చెప్పాలి.


 పదవ తరగతి చదువుతున్న విద్యార్థి తన ప్రియురాలని కలిసేందుకు వెళ్లి చివరికి శవమై తేలాడు. పక్క ఊరైన బీర్ గావులోని గర్ల్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాడు విద్యార్థి. అయితే ఆ తర్వాత కనిపించకుండా పోయాడు. స్థానికులు ఇటీవలే ఒక మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇలా బాలిక ఇంటికి వచ్చిన బాలుడిని ఇక బాలిక కుటుంబ సభ్యులే దారుణంగా చంపినట్లు తేల్చారు. ఇక చనిపోయిన అబ్బాయిని సచిన్ కాలే గా గుర్తించిన పోలీసులు. బాలిక తాత, తండ్రి, బాబాయిలను అరెస్టు చేసి జైలుకు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: