ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు చూసిన తర్వాత మనుషులు తాము మనుషులం అన్న విషయాన్ని మరిచిపోతున్నారేమో అనే అనుమానం ప్రతి ఒక్కరిలో కలుగుతుంది. ఎందుకంటే మానవత్వానికి జాలి దయ అనే గుణానికి కేరాఫ్ అడ్రస్ గా ఉండే మనుషులు.. ఇక ఇప్పుడు సాటి మనుషుల విషయంలో ఎంతో క్రూరత్వంతో వ్యవహరిస్తున్న తీరు ప్రతి ఒక్కరిని కూడా షాక్ అయ్యేలా చేస్తూ ఉంది. అంత చిన్న విషయానికే ఇంత దారుణంగా వ్యవహరించడం అవసరమా అనుకునేలా ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.



 ఇక ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కూడా ఇలాంటి తరహా ఘటన అని చెప్పాలి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో జరిగిన ఈ ఘటన సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి. తెలిసి తెలియని వయసులో తోటలోని ఒక పండును కోసేందుకు ప్రయత్నించిన బాలికను పట్టుకున్న తోట యజమాని.. ఇక శిక్షించిన తీరు చూసి ప్రతి ఒక్కరు కూడా షాక్ అవుతున్నారు. అయితే ఇక తమ బిడ్డను శిక్షించిన తోట యజమాని పై కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాధారణంగా పసివాళ్ళు దేవుళ్ళతో సమానం అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ తోట యజమానులు మాత్రం పది సంవత్సరాల బాలికను దారుణంగా హింసించారు.



 తోటలో పండు కోసుకోవడానికి వచ్చిందని.. ఏకంగా బాలికను పశువుల్ని కట్టేసే గొలుసులతో చేతులు కట్టేసి ఎండలో నిలబెట్టారు తోట యజమానులు. అయితే విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తోట యజమానులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న పండు తెంపినందుకు.. తమ బిడ్డను ఇలా కట్టేస్తారా అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే ఆ బాలిక మానసిక స్థితి సరిగ్గా లేక ఆ విధంగా ప్రవర్తిస్తే అయ్యో పాపం అని జాలి పడాల్సింది పోయి ఇంత పాషవికంగా ప్రవర్తిస్తారా అంటూ నిలదీసారు. అయితే ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: