ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా అక్రమ సంబంధాలు ఎక్కువైపోతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. భర్తలకు తెలియకుండా భార్యలు.. భార్యలకు తెలియకుండా భర్తలు రహస్యంగా పరాయి వ్యక్తులతో ఎఫైర్లు పెట్టుకుంటూ ఉన్నారు. ఇక ఇలాంటి అక్రమ సంబంధాలు కొన్ని కొన్ని సార్లు దారుణమైన పరిస్థితులకు కారణం అవుతూ ఉన్నాయి అని చెప్పాలి.  ఇంకొంతమంది అయితే వావి వారసులు మరిచిపోయి మరి అక్రమ సంబంధాలు తెర లేపుతున్న ఘటనలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తూ ఉన్నాయి. అక్రమ సంబంధం పెట్టుకోవడం తప్పు అని తెలిసినా.. కొంతమంది మాత్రం బుద్ధి మార్చుకోవడం లేదు.


 ఇక ఇటీవలే మధ్యప్రదేశ్లో వెలుగులోకి వచ్చిన ఘటన కూడా ఇలాంటి కోవలోకి చెందినదే అని చెప్పాలి. ఏకంగా సొంత కోడలు పైనే మనసు పడ్డాడు మామ. ఈ క్రమంలోనే కొడుకు ఇంట్లో లేని సమయంలో ఇక కోడలితో రాసలీలలు కొనసాగించాలని ఆశపడ్డాడు. కానీ చివరికి సొంత కొడుకు చేతిలోనే అత్యంత కిరాతకంగా హత్యకు గురయ్యాడు. బూత్ బందాన్ని గ్రామానికి చెందిన దరోగ్ సింగ్ అనే వ్యక్తి కొడుకు సంజయ్ దుర్వే తో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే సంజయ్ కి గతంలో ఓ యువ వివాహం జరిగింది. ముగ్గురు ఒకే ఇంట్లో కలిసి ఉండేవారు.



 దీంతో ఇంట్లో అందంగా కనిపించే కోడలిపై మామ కన్ను పడింది. కొన్నాళ్లకు కోడలి వైపు నుంచి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. దీంతో ఇక కొడుకు డ్యూటీ కి వెళ్ళిన తర్వాత ప్రతిరోజు కోడలితో ఎంజాయ్ చేయడం మొదలుపెట్టాడు మామ. కొన్నాళ్ళకి భార్య,తండ్రి ప్రవర్తన పై అనుమానం వచ్చిన సంజయ్ నిఘా పెట్టడం మొదలుపెట్టాడు. దీంతో భార్య అక్రమ సంబంధం కాస్త బయటపడింది. దీంతో కోపంతో ఊగిపోయిన సంజయ్ ఓ రోజు తండ్రి తో మాట్లాడి ఒక చోటుకు తీసుకెళ్లి అక్రమ సంబంధం పై ప్రశ్నించాడు. ఇద్దరు మధ్య మాటల యుద్ధం మొదలైంది. క్షణికావేషంలో ఉన్న కొడుకు అత్యంత కిరాతకంగా తండ్రిని హత్య చేశాడు. విషయం తెలుసుకున్న భార్య ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: