తాజాగా ఓ అమ్మాయిని ప్రేమ కారణంగా ఏకంగా హంతకురాలైంది.. తాను పిచ్చిగా ప్రేమించే అబ్బాయి.. తనకు శాశ్వతంగా దక్కడన్న కోపంతో ఓ యువతి అతడినే దారుణంగా నడిరోడ్డుపై పొడిచి చంపేసింది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ ఘటన కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళ్తే.. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం మలకపల్లికి చెందిన గర్సికూటి పావని, తాడేపల్లిగూడెం పాతూరుకు చెందిన అంబటి కరుణ తాతాజీనాయుడు రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ ప్రేమను అబ్బాయి టైంపాస్గా తీసుకున్నాడు. కానీ అమ్మాయి ప్రేమే లోకం అనేంతగా డీప్ లవ్లోకి వెళ్లిపోయింది.
అందుకే ఆ ప్రేమను శాశ్వతం చేసుకోవాలని అతడిని పెళ్లి చేసుకోమని అడుగుతోంది. ఏడాది నుంచి పెళ్లి చేసుకోమని అడుగుతున్నా తాతాజీ మాత్రం ఏదో ఓ సాకు చెప్పి నో చెబుతూ వస్తున్నాడు. సోమవారం మధ్యాహ్నం తాతాజీ ద్విచక్ర వాహనంపై పంగిడి వచ్చాడు. మలకపల్లి నుంచి పావని అతని వద్దకు వెళ్లింది. రాత్రి వరకు పరిసర ప్రాంతాల్లో తిరిగారు. ఎంతగా అడిగినా పెళ్లిపై క్లారిటీ రాలేదు పావనికి పైగా.. తాతాజీ ఇంకా ఎవరినో ప్రేమిస్తున్నాడని అనుమానం వచ్చింది. అంతే.. తనకు తాతాజీ దక్కడేమో అని భయపడింది. ఇక తనకు దక్కడేమో అన్న అనుమానం ఆమె తట్టుకోలేకపోయింది.
రాత్రి ఆమెను దింపడానికి తాతాజీ మలకపల్లి వెళ్తుండగా బండిపై వెనుక కూర్చుని ఉన్న పావని బ్యాగులోని కత్తి తీసి అతని వీపుపై పొడిచింది. కింద పడిపోయిన తాతాజీ మెడ, తల, వీపుపైనా పొడిచింది. తీవ్ర రక్తగాయాలైన తాతాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆ దారిలో వెళుతున్న వారు ఆ సీన్ చూసి అవాక్కయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు హత్య కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి