ఇలా ప్రేమ అనేది నేటి రోజుల్లో ప్రాణం పోవడానికి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఇక ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు అయితే అమానవీయంగా ఉన్నాయి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక్కడ ఇలాంటి సంఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించడమే ఆ యువకుడి పాలిట శాపంగా మారి పోయింది. ఓ యువతిని ప్రేమించిన పాపానికి ఆ యువతి అన్న యువకుడిని దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేసి చంపిన ఘటన బీహార్ లో వెలుగులోకి వచ్చింది. ఘటన బీహార్ తో ఒక్కసారిగా స్థానికులు అందరూ ఉలిక్కిపడ్డారు.
బీహార్ లోని ముజఫర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ చెల్లెలినీ ప్రేమించాడు అన్న కోపంతో ఏకంగా యువకుడి మర్మాంగాన్ని కోశాడు యువతి అన్న. అనంతరం దారుణంగా హత్య చేశాడు. సౌరబ్ అనే 22 ఏళ్ల యువకుడు అదే ప్రాంతంలో ఉండే యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ విషయం ఇటీవల యువతి సోదరులకు తెలిసింది. ఈ క్రమంలోనే ఇక ఆ యువతి సోదరులు తమ స్నేహితులను వెంటబెట్టుకుని యువకుడిని మాట్లాడదాం అంటూ ఇంటికి పిలిపించుకున్నారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన యువకుడు మర్మాంగం కోసేసారు. తర్వాత చిత్రహింసలకు గురిచేశారు. ఇక చనిపోతాడు అని భావించి ఆసుపత్రిలో వదిలి వెళ్ళిపోయారు. ఇక ఆ తర్వాత కాసేపటికి ఆ యువకుడు చనిపోయాడు. దీనిపై బంధువులు కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి