ఎక్కడుంది ఆడపిల్లలకు నేటి సమాజంలో రక్షణ..  ఈ పాడు సమాజం లో ఆడపిల్ల ఎప్పుడూ ఆట బొమ్మేనా..  పురుషుల ఆధిపత్యం ఉన్న ఈ సమాజంలో మహిళా సాధికారత సాధించేందుకు ఎంతగానో శ్రమిస్తున్న మహిళా లోకాన్ని కామంతో కళ్లు మూసుకుపోతున్న మానవ మృగాలు అడుగడుగున చిదిమేస్తూనే ఉన్నారు.  రోజురోజుకు మహిళలపై అత్యాచార ఘటనలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక ఇటీవల తెలంగాణ లోని అతి పెద్ద దావకాన  గాంధీ ఆస్పత్రిలో ఏకంగా అక్క చెల్లెల పై సామూహిక అత్యాచారం జరగడం సంచలనంగా మారిపోయింది.



 ఇక ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం ఈ కేసును ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు ఇక ఈ కేసులో మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఇప్పటికే ప్రధాన నిందితుడిగా ఉన్న ఉమామహేశ్వర్ తో పాటు మరి కొంత మందిని కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక ఇటీవలే పోలీసుల విచారణలో బాధితురాలు ఇద్దరూ కూడా తమపై అత్యాచారం జరిగిన తీరును వివరించారు. ఇద్దరి పై అత్యాచారం చేయాలని అనుకున్న ఉమామహేశ్వర్ ఇక ఒకరిని పేషెంట్ దగ్గరే ఉండాలి అని చెప్పి మరొకరిని తనతో తీసుకెళ్లాడట. ఈ క్రమంలోనే సెక్యూరిటీ రూం కి తీసుకెళ్ళి మత్తుమందు ఉన్న ఖర్చీఫ్ పెట్టి బాధితురాలిని స్పృహ కోల్పోయేలా చేశాడట.



 ఇక ఆ తర్వాత ఉమామహేశ్వర్ భాధితురాలికి మత్తు ఇంజక్షన్ ఇవ్వడం తో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. బాధితురాలు  కొద్దిసేపటికే మళ్లీ స్పృహలోకి వచ్చి చూడగా ఇక ఒంటిపై దుస్తులు లేకపోవడంతో అత్యాచారం జరిగినట్టు గుర్తించింది. అయితే తనపై ఉమామహేశ్వర్ తో పాటు సెక్యూరిటీ గార్డు కూడా లైంగిక దాడికి పాల్పడినట్లు నిర్ధారించుకుంది. ఇక ఆ తర్వాత అక్కడికి వచ్చిన సోదరి కుమారుడు అరుణ్ పిన్ని అర్థ నగ్నంగా ఉండడం చూసి వెంటనే వెళ్లి బట్టలు తెచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.  బాధితురాలి ఫిర్యాదు మేరకు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రస్తుతం ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: