నేటి ఆధునిక సమాజంలో పురుషులకు తాము ఎక్కడ తక్కువ కాదు అని నిరూపిస్తూ ఎంతో మంది మహిళా మణులు ఇక అన్ని రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. చదువుల్లో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో కూడా పురుషులకు పోటీ ఇస్తున్నారు. ఇక మహిళలు అంటే వంట ఇంటికి మాత్రమే పరిమితం కావాలి అన్న వారి నోళ్ళు మూయిస్తూ తలుచుకుంటే ఏదైనా చేయగలమని నిరూపిస్తున్నారు. కానీ కొన్ని ప్రాంతాలలో మాత్రం ఆడపిల్ల ఇంకా మగాడి చేతిలో కీలుబొమ్మగా కొనసాగుతుందా అంటే వెలుగులోకి వస్తున్న కొన్ని ఘటనలు మాత్రం అవుననే చెబుతున్నాయి. ఎందుకంటే నేటి రోజుల్లో మహిళా సాధికారత వైపు అడుగులు వేస్తున్న ఎంతోమందిని కామపు కోరలు వెనక్కి లాగుతున్న  ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.


 ఆడపిల్ల ఒంటరిగా కనిపించింది అంటే చాలా దారుణంగా అత్యాచారం చేయడం అంతటితో ఆగకుండా ప్రాణాలు తీసుకోవడం లాంటి ఘటనలు జరుగుతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో ఏకంగా ఆడపిల్ల అని కూడా చూడకుండా దారుణంగా దాడులకు పాల్పడుతున్న ఘటనలు ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేస్తున్నాయి. ఇటీవలే బీహార్లో ఇలాంటి తరహా ఘటన జరిగింది. పట్టపగలు అందరూ చూస్తుండగా ఒక మహిళ చీర లాగేయడమే కాదు ఇక కాల్చిన వెదురు బొంగులతో ఆ మహిళ ను దారుణంగా చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారి పోవడం తో రాష్ట్రవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం గా మారిపోయింది.


 బీహార్లోని మాదే పుర లో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. నలుగురు వ్యక్తులు తనపై అత్యాచారానికి ప్రయత్నించగా ప్రతిఘటించింది సదరు మహిళ. ఇక ఇలా ప్రతిఘటించినందుకుగాను సదరు మహిళను పట్టపగలే గ్రామపంచాయతి వద్ద శిక్షించారు. అందరూ చూస్తుండగానే ఆమె చీర లాగేసి అర్థనగ్నంగా ఆమెను నిలబెట్టారు. అంతటితో ఆగకుండా మంటల్లో కాల్చినా వెదురు బొంగులతో ఏకంగా ఆమెను దారుణంగా కొట్టడం కూడా మొదలు పెట్టారు.  ఇక ఈ వీడియోలో చూసుకుంటే మృగాల  కంటే దారుణంగా వ్యవహరించారు అని అర్థమవుతోంది. చివరికి ఈ వీడియో పోలీసుల కంటపడటంతో దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు..

మరింత సమాచారం తెలుసుకోండి: