గత కొన్ని రోజుల నుంచి ఎండలు దంచికొడుతున్నాయ్ అన్న విషయం తెలిసిందే. దీంతో జనాలు ఎక్కడ చూసినా దాహం దాహం అంటూ అల్లాడిపోతున్నారు. కాస్త చల్లటి నీరు గొంతు లోకి వెళ్ళింది అంటే ఇక అమృతం తాగినంత హాయిగా ఉంది అన్నట్లుగా ఫీలవుతున్నారు. అంతేకాదు దగ్గరలో ఒక వేళ నీళ్లు అందుబాటులో లేకపోతే ఎంతో హడావిడి గా షాప్ లోకి వెళ్లి బాటిల్ కొని నీళ్లు తాగుతున్నారు. మరికొంతమంది వెనక ముందు ఆలోచించకుండా కనిపించేవి నీళ్లు అని తాగేస్తున్నారు. కానీ ఇక్కడ జరిగిన ఘటన గురించి తెలిసిన తరువాత మాత్రం ఎంత దాహం వేసినప్పటికీ హడావిడిగా నీళ్లు తాగడానికి భయపడిపోతారు.


 ఎందుకంటే ఇక్కడ ఒక యువకుడు నీళ్లు అనుకొని చివరికి యాసిడ్ తాగాడు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విజయవాడ నగరంలోని ఎనికేపాడు లో చోటు చేసుకుంది ఈ ఘటన. కృష్ణా జిల్లా నాగాయలంక కు చెందిన చైతన్య విజయవాడ లయోలా కళాశాలలో ఏవియేషన్ విభాగంలో డిగ్రీ చదువుతున్నాడు. ఇక ఇటీవల స్నేహితులతో కలిసి కేసేపల్లి లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నాడు చైతన్య..


 ఇకపోతే ఇటీవల దాహం వేయడంతో సమీపం లో ఉన్న కూల్ డ్రింక్ షాప్ కి వెళ్లి మంచినీళ్ళ సీసా అడిగాడు. ఈ క్రమంలోనే షాపు యజమాని అక్కడి ఫిడ్జ్ లో ఉంది తీసుకో అంటూ చెప్పాడు. అయితే  చైతన్య ఫ్రిడ్జిలో మంచినీరు బాటిల్ పక్కనే ఉన్న యాసిడ్ బాటిల్ తీసుకొని గుటగుట తాగి దాహం తీర్చుకున్నాడు. అయితే అచ్చం మంచినీటి బాటిల్ లాగానే యాసిడ్ బాటిల్ కూడా ఉండడంతో గమనించలేదు. వెంటనే వాంతులు చేసుకున్నాడూ. దీంతో స్నేహితులు సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. యాసీడ్ తాగినట్లు ధ్రువీకరించిన వైద్యులు ఆసుపత్రికి తీసుకోవాలని సూచించడంతో విజయవాడ సూర్యారావుపేట లో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లగా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: