కారణమేంటో తెలియదుగానీ ఒకప్పటిలా నేటి రోజుల్లో భార్య భర్తల బంధంలో అన్యోన్యత మాత్రం ఎక్కడా కనిపించడం లేదు అనే చెప్పాలి. పెళ్లి చేసుకొని కలకాలం సుఖసంతోషాలతో ఉండాల్సిన భార్యాభర్తలు కొన్నాళ్ళకే మనస్పర్ధలతో బద్ద శత్రువులు గా మారిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి.  రోజు రోజుకు వెలుగులోకి వస్తున్న ఘటనలు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వారి  మనసులో భయాన్ని పుట్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఇలా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కరువై దారుణాలు జరిగిపోతున్న ఘటనలు ఎన్నో వెలుగులోకి వస్తున్న విషయం తెలిసిందే.


 ఇక్కడ ఇలాంటి తరహా ఘటన జరిగింది. వారిద్దరికీ పెళ్ళై కొన్నేళ్లు అవుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతుంది. ఈ క్రమంలోనే  భర్త తీరుతో కోపంతో రగిలిపోయిన భార్య ఓ రోజు రాత్రి ఏకంగా క్రికెట్ బ్యాట్ తో భర్తను చితకబాదింది. ఇందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ లో వైరల్ గా మారిపోయింది. భార్య బ్యాట్ తో  కొడుతుంటే కిందపడిపోయిన భర్త కేకలు వేయడంతో స్థానికులు వచ్చి అతని కాపాడారు. అంతేకాదు భార్యాభర్తలు ఇద్దరూ ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం గమనార్హం. ఈ షాకింగ్ ఘటన రాజస్థాన్లోని బికనీర్ లో వెలుగులోకి వచ్చింది.


 రిద్మా ల్సర్ గ్రామంలో భార్యాభర్తలు అనీషా, అమీన్ నివాసముంటున్నారు. కొన్నాళ్ళు వీరి సంసారం సాఫీగానే సాగిపోయింది. కానీ ఇటీవల తరచూ గొడవ పడుతూ ఉండేవారూ. అయితే ఇటీవలే రాత్రి 11 గంటల సమయంలో తన భర్త అమీన్ ను క్రికెట్ బ్యాట్ తో చిత కొట్టింది భార్య. ఇక భర్త కేకలు పెట్టిన పొరుగింటి వారి పెద్దగా పట్టించుకోలేదు. తరచు వీళ్ళు ఇలాగే గొడవ పడుతూ అరుస్తుంటారు అంటూ భావించారు. కానీ ఎంతకీ  అరుపులు ఆగకపోవడంతో ఏం జరుగుతుందో అని చూసేందుకు వెళ్లారు. అనీషా క్రికెట్ బ్యాట్ తో భర్తను  కొట్టడం చూసి షాకయ్యారూ. వెంటనే బ్యాట్ లాక్కొని  భర్తను కాపాడారు. అప్పటికే అతనికి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. తలకు 17 కుట్లు పడ్డాయి. భర్త తనను రోజూ తాగొచ్చి కొడుతున్నాడని ఫిర్యాదులో పేర్కొంది భార్య.

మరింత సమాచారం తెలుసుకోండి: