ప్రైవేట్ సోషల్ మీడియా ద్వారా ఇటువంటి వార్త ఏదైనా పెడితే అక్కడ ప్రభుత్వం వెంటనే డిలీట్ చేసేస్తుంది. ఆ తర్వాత వాళ్ళని అక్కడ ప్రభుత్వం వెంటనే అరెస్టు చేస్తుంది. కాల్చిపడేసినా ఆశ్చర్యపోనక్కరలేదు . ఎందరు చనిపోయినా వాళ్ళను మానవ హక్కుల వాళ్ళు లేదా పౌర హక్కుల వాళ్ళు ఇలా ఎవరూ వాళ్ళని అడిగేవాళ్ళు లేరు. కరోనాని ప్రపంచదేశాల పై వదిలిన చైనాను అమెరికా లాంటి దేశాలు కొన్ని విషయాలలో చూసీ చూడకుండా వదిలేస్తున్నాయి. చైనాలోనే వాళ్ళు ఇండస్ట్రీలు నడుపుతున్నారు కనుక చీఫ్ గా లేబర్ దొరికే చైనాను వదులుకోవడం ఇష్టం లేక..అలా చేస్తున్నారు.
అమెరికాలో వర్కర్స్కు ఒక్కొక్కరికి 10వేల డాలర్లు పే చెయ్యాల్సి వస్తుంటే చైనాలో అదే అమౌంట్ కి 20మంది వస్తారు. క్వారంటైన్ నిబంధనలు ఎత్తేసిన తర్వాత చాలా దేశాల జనాలు అక్కడున్న వాళ్ళ వ్యాపారాలు పాడవకుండా ఉండడం కోసం, మాస్కులు, శానిటైజర్లు వేసుకుని మరీ చాలా జాగ్రత్తగా చైనా కు వెళ్తున్నారు. రెండు సంవత్సరాల కఠిన నిర్బంధం తర్వాత చైనాలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోవడంతో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా జలుబు, దగ్గు లాంటి కరోనా లక్షణాలు ఉంటే టాబ్లెట్ వేసుకుని తిరిగేయ్యండని చెప్తుంది. చైనా అయితే ఆ పని చెప్పక ముందే చేసేస్తుంది.