పిల్లలు చాలా సున్నితమైన వారు. వారికి ఏదైనా అర్ధమయ్యేలా ఇష్టం కలిగేలా ప్రతి తల్లిదండ్రులు వారికి చెప్పాలి.పిల్లలను ఎప్పుడూ కూడా ఇతర పిల్లలతో పోల్చవద్దు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వారి స్వంత సామర్థ్యం ఉంటుంది.ఇంకా పిల్లల నుంచి సరైన అంచనాలు, ఎక్కువ మార్కులు వచ్చేలా వారిపై ఒత్తిడి అస్సలు పెట్టకూడదు. పిల్లలకు ఖచ్చితంగా కూడా భావోద్వేగ మద్దతు అవసరం. వారి గత వైఫల్యాల గురించి వారితో అస్సలు మాట్లాడకండి.ఇక పిల్లవాడు ఎక్కువ కాలం చదువుకోవాలనుకుంటే, తల్లిదండ్రులలో ఒకరు అతనితో బాగుండాలి. ఇక అది వారి ధైర్యాన్ని పెంచుతుంది.ఇక పిల్లలతో చదువులు, సిలబస్ గురించి అస్సలు మాట్లాడకండి. భవిష్యత్తు ప్రణాళికలు ఇంకా కెరీర్ మొదలైన వాటి గురించి కూడా మాట్లాడకండి.పిల్లలు మనం పెట్టే ఒత్తిడి వల్ల నిరంతర తలనొప్పి, శరీర నొప్పి, తల తిరగడం, వికారం, మతిమరుపు, భయం, అలసట ఇంకా అలాగే చదువుపై ఆసక్తి లేకపోవడం వంటి సమస్యలు వారిలో కనిపిస్తాయి. మీకు అలా కనిపిస్తే.. వాటిపై ఖచ్చితంగా శ్రద్ధ వహించండి.


బహుశా వారు చాలా ఒత్తిడిలో ఉన్నారని మీరు అర్థం చేసుకోండి.అంతేకాని చదువుకోకుండా సాకులు చెబుతున్నాడని అనుకోవద్దు. ఈ సందర్భంలో కుదిరితే వెంటనే వారిని సైకాలజిస్ట్ లేదా కౌన్సెలర్ వద్దకు తీసుకెళ్లండి. ఇంకా వారికి కొంత యోగలోని ట్రిక్స్ చెప్పండి. ఫిజికల్ గా ఆరోగ్యంగా ఉండేందుకు బయటకి తీసుకెళ్లి వారితో ఆటలు ఆడుకోండి.చాలా మంది తల్లి దండ్రులు వారు ఎక్కువగా ఆటలాడుతుంటారని మందలిస్తూ ఉంటారు. కానీ అది అస్సలు మంచిది కాదు. ఆడుకుంటూనే వారు ఆరోగ్యంగా ఉంటారు.పిల్లలకు సమయానికి ఆహారం తినిపించడంతో పాటు 7 నుంచి 8 గంటల నిద్రని అలవాటు చెయ్యండి. ఎందుకంటే పరీక్షల సమయంలో సరైన నిద్ర చాలా ముఖ్యం, అర్థరాత్రి దాకా చదివిన తర్వాత సరిగా నిద్రపోకపోవడం వల్ల, చాలాసార్లు పిల్లలు పరీక్ష సమయంలో చదివిన వాటిని ఈజీగా మరచిపోతారు.అలా కాకుండా పొద్దున్నే అలవాటు చెయ్యండి.

మరింత సమాచారం తెలుసుకోండి: