చాలా మందికి కూడా గవర్నమెంట్ ఉద్యోగం సాధించాలని కోరిక ఉంటుంది. అందుకోసం చాలా ఏళ్లుగా కష్టపడుతూ ఉంటారు. ముఖ్యంగా ఆర్మీలో చేరి దేశానికి సేవ చెయ్యాలని చాలా మంది యువకులు కలలు కంటుంటారు. అలాంటి వారికి గుడ్ న్యూస్.ఇక కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని డైరెక్టరేట్‌ జనరల్ బోర్డర్‌ సెక్యురిటీ ఫోర్స్‌ (బీఎస్‌ఎఫ్‌).. గ్రూప్-సి కేటగిరీలో  మొత్తం 247 హెడ్ కానిస్టేబుల్ (రేడియో ఆపరేటర్, రేడియో మెకానిక్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులని కోరుతూ నోటిఫికేషన్‌ ని రిలీజ్ చేసింది.ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు మొత్తం 60 శాతం మార్కులతో పదో తరగతి, ఐటీఐ లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇంకా అలాగే మ్యాథమెటిక్స్‌ సబ్జెక్టుల్లో ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన కోర్సులో ఖచ్చితంగా ఉత్తీర్ణత పొంది ఉండాలి. ఇంకా అలాగే నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా ఉండాలి.


దరఖాస్తుదారుల వయసు తప్పనిసరిగా 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.కాబట్టి ఈ పోస్టులకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో మే 12, 2023వ తేదీలోపు వీటిని దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే సమయంలో జనరల్ కేటగిరీ అభ్యర్ధులు రూ.100లు అప్లికేషన్‌ రుసుముగా తప్పనిసరిగా చెల్లించాలి. ఇంకా అలాగే ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్ధులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. అలాగే రాత పరీక్ష, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, డిక్టేషన్ టెస్ట్, పేరాగ్రాఫ్ రీడింగ్ టెస్ట్ (హెచ్‌సీ ఆర్‌వోలకు మాత్రమే) ఇంకా అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా కూడా అభ్యర్ధులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకు సంబంధించి రాత పరీక్షని జూన్‌ 4వ తేదీన నిర్వహిస్తారు. ఆ పరీక్షలో మంచిగా ప్రతిభ కనబరచిన వారికి నెలకు రూ.25,500ల నుంచి రూ.81,100ల దాకా జీతంగా చెల్లిస్తారు. ఇంకా ఇతర సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌లో మీరు చెక్‌ చేసుకోవచ్చు.కాబట్టి ఆసక్తి ఇంకా అలాగే అర్హత కలిగిన అభ్యర్థులు ఖచ్చితంగా ఈ పోస్టులకు అప్లై చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BSF