రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA)లో కరోనా సర్వేలెన్స్ చేస్తూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. కొవిడ్-19 లక్షణాలున్న వారిని నేరుగా హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించనున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్లో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూకే నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిలిపివేత డిసెంబర్ 22 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. గత వారం రోజులుగా యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, సౌదీ అరేబియా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు కూడా యూకే నుంచి విమానాలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియాలో బ్రిటన్ తరహా కరోనా వైరస్ కేసులు రెండు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.
రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (RGIA)లో కరోనా సర్వేలెన్స్ చేస్తూ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు అక్కడే ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించనున్నారు. కొవిడ్-19 లక్షణాలున్న వారిని నేరుగా హాస్పిటళ్లకు తరలించి చికిత్స అందించనున్నారు. నెగిటివ్ వచ్చినా వారం రోజులు క్వారంటైన్లో ఉండేలా ఉత్తర్వులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. యూకే నుంచి వచ్చే విమానాలపై భారత ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ నిలిపివేత డిసెంబర్ 22 అర్ధరాత్రి నుంచి ప్రారంభం కానుంది. గత వారం రోజులుగా యూకే నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. జర్మనీ, ఇటలీ, బెల్జియం, ఆస్ట్రియా, సౌదీ అరేబియా, చెక్ రిపబ్లిక్ తదితర దేశాలు కూడా యూకే నుంచి విమానాలను నిలిపివేశాయి. ఆస్ట్రేలియాలో బ్రిటన్ తరహా కరోనా వైరస్ కేసులు రెండు నమోదైనట్లు అక్కడి అధికారులు తెలిపారు.