ఏ కూరల్లో కారం లేకుంటే అవి అసలు బాగోవు.. చాలా చప్పగా ఉంటాయి. కాని కారం వేస్తే మాత్రం వాటి టేస్ట్ సూపర్ ఉంటుంది.ఇక మన కూరల్లో వేసుకునే కారం మితంగా తీసుకుంటే ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అతిగా తీసుకుంటే అన్ని నష్టాలు కూడా కలుగుతాయి. ఎక్కువగా కారం తినడం వల్ల చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య నిపుణులు చాలా క్షుణ్ణంగా చెబుతున్నారు. అసలు ఎలాంటి శారీరక శ్రమ లేని ఈ కాలంలో కారం ఆరోగ్యం పాలిట యమపాశం అనే చెప్పుకోవాలి. పచ్చి మిర్చి ఇంకా ఎండు మిర్చి, లేదా ఎండు కారం ఏదయినా కాని అసలు ఈ కారం చేసే చేటు గూర్చి అనర్థాలు అసలు ఎన్నో ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇక అవి ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం…కారం కనుక చాలా ఎక్కువగా తింటే దానివల్ల అసిడిటీ ఇంకా అలాగే గ్యాస్ సమస్యలు వెంటాడతాయి.ఇంద్రియ వికారాలు చాలా ఎక్కువగా సంభవిస్తాయి.బలహీనత, మూర్ఛ ఇంకా అలాగే మైకము మొదలగు వికారాలు కలుగుతాయి.


కారం తీసుకోవడం ఎక్కువయ్యేకొద్దీ గొంతు ఇంకా అలాగే కడుపులో మంటతో పాటు పలు ఆకస్మిక వ్యాధలు కూడా వెంటాడే అవకాశం చాలా ఎక్కువగా వుంది.కారం ఎక్కువగా తినడం వల్ల కొందరికి విపరీతమైన గ్యాస్ వస్తే, ఇంకొందరికి మాత్రం అజీర్తి ఎక్కువగా మొదలవుతుంది. ఇక కారంపొడి ఎక్కువగా తీసుకోవడం వల్ల నోటిపూత వచ్చే ఛాన్స్ కూడా ఉంది.ఇక స్త్రీలు గర్భధారణ సమయంలో ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల శిశువుకు శ్వాసకోశ వ్యాధులు వచ్చే  ఛాన్స్ ఎక్కువగా వుంది.అలాగే కారంపొడిని ఎక్కువగా తింటే కడుపులో అల్సర్లు వచ్చే ప్రమాదం ఇంకా కొందరకి కడుపులో పుండ్లు కూడా ఎక్కువగా ఏర్పడతాయి.అలాగే ఎర్ర మిరపకాయలను ఎక్కువగా తినడం వల్ల ఆస్తమా వచ్చే ప్రమాదం కూడా చాలానే ఉంది.కాబట్టి కారం ఎక్కువగా తినటం తగ్గించండి.ఆరోగ్యంగా ఉండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: