ఈ రోజుల్లో గుండె జబ్బుల బారిన పడడానికి ప్రధాన కారణం నూనెలో వేయించిన పదార్థాలను ఎక్కువగా తినడం.అలాగే ఉప్పును కూడా ఎక్కువగా తీసుకోవడమేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. నూనెలో వేయించిన పదార్థాలను తినడం వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి రక్తసరఫరాకు అనేక అడ్డంకులు ఏర్పడతాయి. ఇంకా అలాగే ఉప్పును తీసుకోవడం వల్ల రక్తనాళాలు వ్యాకోచించే గుణాన్ని కూడా తగ్గిపోతాయి. దీంతో రక్తసరఫరా అనేది అంత సాఫీగా సాగదు. ఉప్పును ఎక్కువగా తీసుకోవడం వల్ల బీపీ సమస్య కూడా ఎక్కువగా తలెత్తుతుంది. ఈ బీపీ కారణంగా గుండె కండరాలు బాగా బిగుసుకు పోతాయి. అలాగే ఉప్పును తీసుకోవడం వల్ల రక్తం కూడా బాగా చిక్కబడుతుంది. అలాగే గుండె సమస్యలకు మరో కారణం పంచదార ఇంకా పాలిష్ బట్టిన ఆహారాలను తీసుకోవడం. మైదా, రవ్వ, ఉప్పుడు రవ్వ వంటి వాటితో తయారు చేసిన పదార్థాలను తినడం వల్ల కూడా గుండె సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.


ఇంకా అలాగే ఈ పదార్థాలు రక్తాన్ని చిక్కబడేలా కూడా చేస్తాయి.అలాగే ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా బాగా పెంచి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. ఈ కారణం వల్ల కూడా హార్ట్ ఎటాక్ లు చాలా ఎక్కువగా వస్తాయి. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే గుండెకు మేలు చేసే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉండే ఆహారాలను ఖచ్చితంగా తీసుకోవాలి. అవిసె గింజలు, వాల్ నట్స్ ఇంకా అలాగే బాదం పప్పు వంటి వాటిని ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఇంకా అలాగే ప్రకృతి ఇచ్చిన ఆహారాలను కూడా ఎక్కువగా తీసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఫైబర్, ప్రోటీన్ లు ఎక్కువగా ఉంటాయి. ఇవి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను ఈజీగా పెంచుతాయి. ఇంకా అలాగే డ్రై ఫ్రూట్స్, డ్రై నట్స్ ను ఎక్కువగా తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: