గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేషణల సమహారమే చరిత్ర. నాటి ఘటనలను..మానవుడు నడిచి వచ్చిన బాటలను స్మరించుకోవడానికే చరిత్రే. ప్రపంచ మానవాళి పరిణామ క్రమంలో ఫిబ్ర‌వ‌రి 23వ తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది. హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం

ముఖ్య సంఘటనలు

2009: 91వ అకాడమీ అవార్డులలో భారతదేశానికి చెందిన ఏ.ఆర్.రెహమాన్ కు రెండు ఆస్కార్ అవార్డులు లభించాయి.

ప్ర‌ముఖుల జననాలు

1483: బాబర్, మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు. (మ.1531)
1762: వెలుగోటి కుమార యాచమ నాయుడు వెంకటగిరి సంస్థానాన్ని పాలించిన జమీందారు. (మ.1804)
1931: నూజిళ్ళ లక్ష్మీనరసింహం, వేదమూర్తులు, సంస్కృతాంధ్ర భాషా ప్రవీణులు, ఉపన్యాస కేసరి, హిందూ ధర్మ పరిరక్షణా కంకణ దీక్షాపరులు
1954: సద్గురు బాబా హరదేవ్ సింగ్ మహరాజ్ జన్మదినం. సంత్ నిరంకారీ మండలం ఆధ్వర్యంలో గురుపూజ ఉత్సవం జరుగుతుంది.
1957: కింజరాపు ఎర్రన్నాయుడు, తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరొ సభ్యుడు, కేంద్ర మాజీ మంత్రి. (మ.2012)
1966: పీపుల్స్ వార్ కార్యకర్తగా మారింది. తన వెవాహిక జీవితంలోని పురుషాహంకారానికి ఎదురు తిరిగి 1995లో హైదరాబాద్‌లో ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగిగా ఒంటరి జీవితం ప్రారంభించారు
1967: శ్రీ శ్రీనివాసన్, అమెరికన్ న్యాయవేత్త.జన్మత: భారతీయుడైన 46 ఏళ్ల వ్యక్తి అయిన శ్రీ శ్రీనివాసన్ అమెరికాలో రెండవ అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా కొలువుదీరారు. శ్రీ శ్రీనివాసన్ భగవద్గీత సాక్షిగా కొలంబియా జిల్లా అప్పీల్ కోర్టు జడ్జిగా ప్రమాణస్వీకారం చేశారు. అమెరికాలో ఉన్నత న్యాయస్థానాలను అధిరోహించిన భారత సంతతి వ్యక్తులు ఇప్పటికే పలువురు ఉన్న విషయం తెలిసిందే. అయితే, శ్రీనివాసన్ అమెరికాలో రెండవ అత్యున్నత న్యాయస్థానంగా భావించే సర్క్యూట్ కోర్టు జడ్జిగా నియమితులైన తొలి భారతీయ అమెరికన్ గా చరిత్ర సృష్టించారు.
1982: కరణ్ సింగ్ గ్రోవర్, భారతీయ టెలివిజన్ నటుడు, మోడల్.

ప్రముఖుల మరణాలు

1503: అన్నమయ్య, మొదటి వాగ్గేయకారుడు (సాధారణ భాషలో గేయాలను కూర్చేవారు) పదకవితా పితామహుడు
1821: జాన్ కీట్స్, బ్రిటీష్ రచయిత. (జ.1795).
1848: అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ క్విన్సీ ఆడమ్స్.
1855: కార్ల్ ఫ్రెడెరిక్ గాస్, జర్మనీకి చెందిన గణిత శాస్త్రజ్ఞుడు. (జ.1777)
2014: తవనం చెంచయ్య, సాంఘిక బహిష్కరణల వంటి దురాచారాలకు వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి, పోరాటాలు సాగించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: