మన కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ మధ్య కాలం చిన్న వయస్సులోనే చాలా మందికి దృష్టి లోపం ఏర్పడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా కంటి భద్రత గురించి ఆందోళన చెందడానికి ఇదే చాలా ముఖ్య కారణం అని చెప్పవచ్చు. ఈ రోజు ఇంటి నుండి పని వల్ల ప్రజలు మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌లలో ఇంట్లోనే ఎక్కువ పని చేస్తున్నారు. అప్పుడు కంటి సంరక్షణ అనేది చాలా అవసరం అవుతుంది. ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. దీనికి ఉత్తమ ఔషధం పచ్చి ఆకు కూరలు ఇంకా పండ్లు. కూరగాయల రసాలను తీసుకోవడం వల్ల కంటి ఆరోగ్యం కూడా బాగా మెరుగుపడుతుంది. క్యారెట్లు, బీట్‌రూట్ ఇంకా అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యాన్ని కాపాడతాయి. మీరు శరీరంలోని ఇతర భాగాలను చూసుకున్నట్లే మీ కళ్ళను కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంట్లో దొరికే కూరగాయల రసాన్ని తీసుకోవడం ద్వారా మీరు మీ కళ్ళను  చాలా జాగ్రత్తగా చూసుకోవచ్చు.క్యారెట్ రసం అనేది దృష్టికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. క్యారెట్‌లోని విటమిన్ A చాలా పుష్కలంగా ఉంటుంది.ఇక ఇది దృష్టిని మెరుగు పరచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రతి రోజు కూడా క్యారెట్ జ్యూస్ తాగడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది.


అలాగే ఆకు కూరలు కంటి సమస్యలకు దూరంగా ఉండేందుకు సహాయపడుతాయి. ఈ ఆకు కూరలు కళ్లకే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి. మరీ ముఖ్యంగా పాలకూర రసం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ప్రతిరోజూ కూడా మీరు పాలకూర రసాన్ని కొద్ది మొత్తంలో తీసుకోవడం ద్వారా మీరు మీ దృష్టిని మరింత త్వరగా మెరుగుపరుచుకోవచ్చు. ఇందులో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, మెగ్నీషియం, మాంగనీస్ ఇంకా అలాగే ఐరన్ అనేవి చాలా పుష్కలంగా ఉంటాయి.ఇంకా ఉసిరి రసంలో విటమిన్ సి ఉంటుంది. ఇది కంటికి ఎంతగానో మేలు చేస్తుంది. అలాగే ఉసిరి రసం కూడా తాగవచ్చు. దీన్ని మీ ఆహారంలో చేర్చడం ద్వారా మీ కంటి ఆరోగ్యాన్ని బాగా కాపాడుకోండి.ఇక కంటి ఆరోగ్యం కోరేవారంతా కూడా చేపలను తినాలి. ముఖ్యంగా చేపల్లో విరివిగా లభించే ఒమేగా-3 ఫాటీ ఆమ్లం కంటిజబ్బులను దూరం చేయటమే గాక రెటీనా పనితీరును  కూడా బాగా పెంచుతుంది.ఇంకా రాత్రివేళ మెరుగైన కంటిచూపు కోరేవారంతా తప్పక బ్లూబెర్రీస్‌ తినాల్సిందే. వీటిలో పుష్కలంగా లభించే యాంథోసైనిన్స్‌ ఇంకా విటమిన్‌-సి కంటిచూపును మెరుగుపరచడమే కాకుండా కళ్ల అలసటను కూడా పోగొట్టి ఉపశమనాన్నిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: