పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ప్రత్యేకమైన ఘట్టం. ఒంటరిగా ఏకాకిగా సాగిపోతున్న జీవితానికి ఒక తోడు నీడను అందిస్తూ ఉంటుంది పెళ్లి అనేబంధం. ఈ క్రమంలోనే యువతీ యువకులిద్దరు కూడా పెళ్లి పైన ఎన్నో  ఆశలు పెట్టుకుంటూ ఉంటారు  తమకు నచ్చిన వరుడు రెక్కల గుర్రం మీద ఆకాశం నుంచి దిగివచ్చి తనను తీసుకువెళ్తాడని అమ్మాయిలు కలల రాకుమారుడు కోసం ఎదురు చూస్తూ ఉంటారు  అయితే తమకు నచ్చిన భాగస్వామి జీవితంలోకి వచ్చి తమ లైఫ్ ను మరింత ఆనందంగా మార్చేస్తుంది అని యువకులు ఆశ పడుతూ ఉంటారు.


 అయితే ఇలా పెళ్లిళ్ల విషయంలో ఒక్కొక్కరి ఆలోచన తీరు ఒక్కోలా ఉంటుంది. కొంతమంది ప్రేమ వివాహం చేసుకోవాలని అనుకుంటే.. ఇంకొంతమంది పెద్దలు కుదిరించిన వివాహం చేసుకోవాలని అనుకుంటూ ఉంటారు. మరి కొంత మంది ఏకంగా మేనరికం పిల్లను చేసుకుంటే బాగుంటుందని అనుకోవడం చేస్తూ ఉంటారు  అయితే ఇక సినిమాలో చూపించినట్లుగానే ఏకంగా పిల్లలు పుట్టినప్పుడే పెద్దయ్యాక వారి పెళ్లి చేయాలని నిశ్చయించుకోవడం కూడా చూస్తూ ఉంటాం. అయితే మేనరికం పిల్లను చేసుకుంటే మంచిదేనా.. అలా చేసుకుంటే ఏకంగా పుట్టబోయే పిల్లలు అంగవైకల్యంతో పుడతారు అనుమానాలు ఇప్పటికీ ఎంతోమందిలో ఉన్నాయి అని చెప్పాలి.



 అయితే ఇదే విషయంపై ఇటీవలే ఒక అధ్యయనం నిర్వహించగా.. షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. మేనరికం, దగ్గర బంధువులను పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులతో పాటు నేత్ర సంబంధిత సమస్యలు కూడా సంక్రమించే అవకాశం ఉంది అని అధ్యయనంలో వెళ్ళడైంది. ఎల్ వి ప్రసాద్ ఆసుపత్రి అధ్యయనంలో ఇక ఈ విషయం తెర మీదకి వచ్చింది  కార్నియాలో మచ్చలు, గ్లాకోమా, రెటినైటీస్, పిగ్మెంటోసా తలెత్తే ముప్పు ఉందని వైద్యుల హెచ్చరించారు. అంతేకాకుండా కంటిని పూర్తిగా దెబ్బతీస్తే ప్రమాదం ఉంటుందట. ఇక సమస్యలను ముందే గుర్తిస్తే శస్త్ర చికిత్సలు.. మందుల ద్వారా నివారించవచ్చు అని వైద్యులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: