దేశంలో కరోనా వైరాస్ కారణంగా విద్యాసంస్థలు ఇక ప్రారంభానికి నోచుకోలేదు. ఇక అధికారులు విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు బోధిస్తున్నారు. ఇక ఉదయం నిద్ర లేచింది మొదలు ఏడెనిమిది గంటల పాటు ఆన్‌లైన్ క్లాసులతో చిన్నారులకు విశ్రాంతి లేకుండా చేస్తున్నాయి. అదేపనిగా ఎదురుగా ఉన్న ఎలక్ట్రానిక్‌ పరికరంపై దృష్టిసారిస్తూ ఉండటం,  స్క్రీన్ ‌పై అక్షరాలు కనిపించక కళ్లు పెద్దవి చేసి చూడటం వంటి కారణాల వల్ల చిన్నారుల కండ్లల్లో నీరు లేకుండా పోయి డ్రై ఐస్‌గా మారుతున్నాయి. ఫలితంగా కళ్ళు కదిలేటప్పుడు ఘర్షణ పెరిగి గాయాలవుతాయని వైద్యనిపుణులు చెప్తున్నారు.

అయితే లాక్‌డౌన్ తరువాత కంటి సమస్యలతో చిన్నారులు బాధపడుతున్న కేసులు మునుపటి కంటే మూడు నుంచి నాలుగు రెట్లు పెరిగాయని వైద్యులు చెప్తున్నారు. గంటలకొద్ది ఎలక్ట్రానిక్‌ పరికరాలకు కళ్ళప్పగించడంతో ప్రతికూల వ్యత్యాసాన్ని కలిగించడమే కాక, శారీరక, మానసిక అభివృద్ధి కూడా నిలిచిపోతుందని నిపుణులు అంటున్నారు. కళ్ళజోడు పెట్టుకునే విద్యార్థుల సంఖ్య ఇటీవలి కాలంలో పెరుగుతోంది. కళ్ళు క్షీణించడం, తలనొప్పి, తల భారంగా అనిపించడం, కార్నియా దెబ్బతినడం, మైగ్నేన్‌ వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు చిన్నపిల్లల వైద్యులు గుర్తించారు. అదేపనిగా దగ్గరి నుంచి ఎలక్ట్రానిక్ పరికరాలను చూసేవారిలో కంటి లోపలి నుంచి తిరిగే కండరాలు చిరిగిపోవటం ప్రారంభించి కొన్ని రోజుల తరువాత పిల్లలు సమీపంలోని విషయాలను చదవలేరని వారు చెప్తున్నారు.

ఇక ఆన్‌లైన్‌ తరగతులకు హాజరయ్యే విద్యార్థులు అదేపనిగా కంప్యూటర్‌, మొబైల్‌ స్క్రన్లపై చూడకూడదు. ప్రతి 20 నిమిషాలకు కళ్లకు విశ్రాంతి ఇవ్వాలి. నిరంతరం పనిచేస్తుంటే కళ్ళలో కందెన వంటి చుక్కలు లేదా కృత్రిమ కన్నీటి చుక్కలను వాడండి. తలనొప్పి ఉంటే కళ్లను పరీక్ష చేయించుకోవాలి. రేడియేషన్‌ను ఎక్కువగా ఇచ్చి క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచే పాతకాలం కంప్యూటర్లకు దూరంగా ఉండాలి. ఎల్‌సీడీ, పీపీపీపై పని చేయండి. చిన్న పిల్లలను మొబైల్ లేదా కంప్యూటర్‌పై ఎక్కువసేపు చూడకుండా ప్రయత్నించండి. ప్రతి అర్ధగంటకు ఒకసారి కూర్చున్న చోటు నుంచి కదలడం అలవాటు చేసుకోవడం ద్వారా మోకీళ్ల నొప్పులు, ఇతర సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: