పుల్లపుల్లగా ఇంకా అలాగే తియ్యతియ్యగా ఉండే నారింజ పండ్లను తినేందుకు, జ్యూస్‌ తాగేందుకు ఇష్టపడతారు. ఈ సీజన్‌లో ఎక్కువగా దొరికే ఆరెంజ్ పండ్లు..ముఖ్యంగా నారింజ జ్యూస్ ఆరోగ్యానికి చాలా మంచిది. కాబట్టి దాని ప్రయోజనాలు తెలుసుకొని రోజు తాగండి.నారింజ పండు బాగా రుచిగా ఉండడంతో పాటు అనేక పోషకాలు దాగున్నాయి. నారింజ, దాని రసం రెండూ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఆరెంజ్ మన శరీరంలోని రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ఇంకా అనేక వ్యాధుల నుంచి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది. ఆరెంజ్ విటమిన్ సికి మంచి మూలం. ఆరోగ్యకరమైన చర్మం, బలమైన జుట్టు, కంటి చూపుకి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గర్భధారణ సమయంలో మహిళలకు సంత్రపండ్లు సర్వరోగ నివారిణిగా చెబుతారు ఆరోగ్య నిపుణులు. నారింజ తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..ఒక నారింజలో 170 కంటే ఎక్కువ ఫైటోకెమికల్స్, 60 ఫ్లేవనాయిడ్లు ఉంటాయి. ఇవి ఇతర యాంటీఆక్సిడెంట్ ఫుడ్ లేదా మెడిసిన్ కంటే ఎక్కువ. ఆరెంజ్ క్యాన్సర్, కీళ్లనొప్పులు, మధుమేహం, అల్జీమర్స్ నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది.


మన శరీరం DNA, ఇతర జన్యు పదార్థాలను తయారు చేయడానికి పని చేస్తుంది. దీనికి బి విటమిన్ ఫోలేట్ అవసరం. గర్భిణీ స్త్రీలు గర్భధారణ సమయంలో నారింజ తినమని వైద్యులు సలహా ఇవ్వడానికి కారణం ఇదే. నారింజను తినడం వల్ల పిల్లల మెదడు సరిగ్గా అభివృద్ధి చెందుతుంది.నారింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను దూరం చేసి పేగులను శుభ్రంగా ఉంచడంలో సహాయపడుతుంది. మన శరీరానికి సరైన మొత్తంలో ఫైబర్ లభిస్తే, అది కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మధుమేహం సమస్య నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది. దీనితో పాటు, నారింజ గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.విటమిన్ సి నారింజలో 70 శాతం వరకు ఉంటుంది. ఒక నారింజలో విటమిన్ సీ మన శరీరంలో రోజంతా సరఫరా చేయగలదు. విటమిన్-సి శరీరంలో ఐరన్ నిల్వ చేయడానికి, మెరుగైన రోగనిరోధక శక్తికి అవసరం.కాబట్టి ఖచ్చితంగా ఆరెంజ్ జ్యూస్ తాగండి. లేదా ఆరెంజ్ పండు తినండి. సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: