ఇక ఈ కాలంలో అందరూ కూడా ఎక్కువగా వివిధ విటమిన్ లోపంతో బాధపడుతున్నారు. ఆ లోపంతో ఎక్కువ రోజులు బాధపడకుండా వైద్యులను సంప్రదించి కొన్ని మందులు వాడుతున్నారు. ఇప్పుడు యువతతో పాటు మిడిల్ ఏజ్ ఉన్న వారు కూడా ఎక్కువగా ఈ విటమిన్-డి లోపంతో బాధపడుతున్నారు.దీంతో వారు విటమిన్ -డి సప్లిమెంట్స్ ను మందుల రూపంలో ఉపయోగిస్తున్నారు. అయితే విటమిన్-డి అంటే కొవ్వులో కరిగే విటమిన్. దీన్ని తీసుకున్న వారు ప్రీ డయాబెటిస్ లోని టైప్-2 డయాబెటిస్ నుంచి చాలా ఈజీగా రక్షణ పొందుతున్నారని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ విటమిన్ సహజంగా కూడా మన శరీరానికి అందుతుంది. సూర్యరశ్మి ద్వారా శరీరం విటమిన్-డి ని పొందుతుంది. విటమిన్-డి శరీరంలోని ఇన్సులిన్ ఇంకా అలాగే గ్లూకోజ్ జీవక్రియలో కూడా ఖచ్చితంగా చాలా సాయం చేస్తుంది. విటమిన్-డి సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. అవేంటో  ఇప్పుడు తెలుసుకుందాం.


వివిధ పరిశోధనల్లో విటమిన్-డి లోపం ఉన్న వారు ఎక్కువగా టైప్-2 డయాబెటిస్ తో బాధపడుతున్నారని పరిశోధనలో తేలింది. అయితే విటమిన్ -డి సప్లిమెంట్స్ ని  వాడడం ద్వారా వారు డయాబెటిస్  నుంచి ఈజీగా బయట పడ్డారని నిపుణులు చెబుతున్నారు. మూడు సంవత్సరాల పాటు నిరంతరాయంగా చేసిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. విటమిన్ సప్లిమెంట్ వాడిన వారిలో మొత్తం 22.7 శాతం మందికి ఇంకా ప్లెసిబో వాడిన 25 శాతం మందికి మధుమేహం వచ్చిందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. ఓ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం 374 మిలియన్ల మంది కూడా ప్రీ డయాబెటిస్ తో బాధపడుతున్నారు. అయితే వీరు విటమిన్ డి కనుక వాడితే 10 మిలియన్ల మందికైనా డయాబెటిస్ రాకను ఆలస్యం చేస్తుందని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. అయితే విటమిన్-డి సప్లిమెంట్స్ ను కనుక ఎక్కువగా తీసుకుంటే వివిధ సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి కచ్చితంగా డాక్టర్ల సూచన ప్రకారం విటమిన్-డి సప్లిమెంట్స్ ను వాడాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: