నొప్పులతో బాధపడే వారు ఒక చక్కటి టిప్ ని ఉపయోగించడం వల్ల చాలా ఈజీగా కీళ్ల నొప్పులు తగ్గుతాయి. ఈ టిప్ ని వాడడం వల్ల వాత దోషాలు ఇంకా కఫ దోషాలు తొలగిపోతాయి. ఈ టిప్ ని వాడడం వల్ల గౌట్, ఆర్థరైటిస్ సమస్యలు కూడా తగ్గుతాయి. ఈ టిప్ ని మనం సహజ సిద్దంగా లభించే పదార్థాలతో తయారు చేస్తున్నాము కాబట్టి దీనిని వాడడం వల్ల ఎటవంటి దుష్ప్రభావాలు ఉండవు.అలాగే అనారోగ్య సమస్యలు కూడా తలెత్తవు. మన శరీరంలో ఉండే వాత దోషాలను ఇంకా నొప్పులను తగ్గించే చిట్కా ఏమిటి..తరువాత దీనిని ఎలా తయారు చేసుకోవాలి..వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ టిప్ ని తయారు చేసుకోవడానికి గానూ మనం 50 గ్రాముల శొంఠిని తీసుకోవాలి. అలాగే 50 గ్రాముల మెంతులను ఇంకా 50 గ్రాముల వామును ఉపయోగించాల్సి ఉంటుంది. తరువాత వీటిని జార్ లో వేసి బాగా మెత్తని పొడిగా చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పొడిని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి కలపాలి.


అలాగే ఆ తరువాత ఇందులో ఒక టీ స్పూన్ బెల్లం పొడిని వేసి కలపాలి. అయితే డయాబెటిస్ తో బాధపడే వారు మాత్రం బెల్లం పొడిని ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని అల్పాహారం తినడానికి ఒక అర గంట ముందు తాగాలి.ఇక ఇలా 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వాత దోషం ఈజీగా తగ్గిపోతుంది. కీళ్ల నొప్పులు ఇంకా మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయి. అలాగే నడిచేటప్పుడు మోకాళ్ల నుండి శబ్దం రాకుండా ఉంటుంది. కీళ్ల వాపులు కూడా ఈజీగా తగ్గిపోతాయి. అంతేకాకుండా ఈ టిప్ ని వాడడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడుతుంది. మనం తిన్న ఆహారం కూడా చక్కగా జీర్ణమవుతుంది. రక్తహీనత సమస్య సులభంగా తగ్గుతుంది. ఈ విధంగా ఈ టిప్ ని పాటిస్తూనే క్యాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవాలి. ప్రతి రోజూ విటమిన్ డి కోసం ఎండలో కూర్చోవాలి. అలాగే తేలిక పాటి వ్యాయామాలు కూడా చేయాలి. ఈ విధంగా ఈ టిప్స్ పాటించడం వల్ల కీళ్ల నొప్పులను చాలా ఈజీగా మనం తగ్గించుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: