ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ తాగడం ద్వారా మనకి త్వరగా ఆకలి అవ్వదు అందువల్ల బరువు కూడా తగ్గే అవకాశం ఉంది. ఇక ఎవరైతే డైటింగ్ లో ఉంటారో వాళ్లు ఈ పచ్చి మామిడికాయలు జ్యూస్ ను తాగడం ద్వారా ఈజీగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఈ పచ్చి మామిడికాయల జ్యూస్ ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.ముందుగా రెండు పచ్చి మామిడికాయలను తీసుకొని వాటిని మెత్తబడే వరకు ఉడకబెట్టాలి. ఇక అవి ఉడికిన తర్వాత, దాని తొక్క తీసి, గుజ్జును ఓ కప్పులో వాటిని భద్రపరుచుకోవాలి. మీ మామిడికాయ గుజ్జులో ఒక టీ స్పూన్ పంచదార ఇంకా రుచికి తగినంత ఉప్పుతో కలిపి మెత్తని పేస్ట్ తయారు చేసుకోవాలి.ఈ మామిడికాయ గుజ్జులో జీలకర్ర , మిరియాలు ఇంకా అలాగే ధనియాల పొడి వంటి మసాలా దినుసులను కలుపుతారు. దీంతో ఈ గుజ్జు కొద్దిగా కారంగానూ, తియ్యగానూ, ఇంకా అలాగే పుల్లగానూ ఉంటుంది. ఇక  మామిడి పన్నా రెడీ అయిపోతుంది.మామిడి పన్నా డ్రింక్ తయారు చేయడం చాలా ఈజీ. మీరు ముందుగా ఒక టీస్పూన్ మామిడి గుజ్జును తీసుకోవాలి. తరువాత దానికి ఒక గ్లాసు చల్లటి నీటిని ఐస్ క్యూబ్స్‌తో జోడించాలి.ఇప్పుడు తియ్యటి పుల్లటి రుచి కలిగిన మామిడి పన్నా జ్యూస్ రెడీ అవుతుంది.


ఈ మామిడి పన్నా జ్యూస్ పైన రుచి కోసం కొద్దిగా పుదీనా ఆకులను వేసుకుంటే చాలా బాగుంటుంది.ఇంకా అలాగే రుచి కోసం ఇందులో తేనెను కూడా కలుపుకోవచ్చు. సబ్జా గింజలను జోడిస్తే కూడా మరింత రుచికరంగా ఇంకా శరీరానికి చలువ చేస్తుందని చెప్పవచ్చు.ఈ మామిడి పండ్ల జ్యూస్ ను సాయంత్రం పూట తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ జ్యూస్ తాగిన తర్వాత రాత్రి భోజనం వేళ ఎక్కువగా ఆకలి కాదు. అందు ఫలితంగా మీరు బరువు తగ్గే ఛాన్స్ లభిస్తుంది. అలాగే మీ శరీరం వేసవి చెమటలో కోల్పోయిన లవణాలు పోషకాలను కూడా అందిస్తుంది. మరి ఇంకెందుకు ఆలస్యం అధిక బరువు సమస్యతో బాధ పడేవారు ఖచ్చితంగా ఈ డ్రింక్ తాగండి.ఈ డ్రింక్ తాగితే అధిక బరువు సమస్యతో పాటు మిగిలిన అనారోగ్య సమస్యలు కూడా చాలా ఈజీగా మాయం అవుతాయి.కాబట్టి ఖచ్చితంగా ఈ డ్రింక్ తాగండి. ఎల్లప్పుడూ ఎలాంటి రోగాలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంగా వుండండి.

మరింత సమాచారం తెలుసుకోండి: