చాలా మంది కూడా వేసవి తాపం నుండి బయట పడడానికి ఐస్ క్రీమ్ లను, శీతల పానీయాలను ఎక్కువగా తాగుతూ ఉంటారు. అయితే వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి మేలు జరుగదు.ఇంకా అంతేకాకుండా శరీరానికి చాలా ఎక్కువగా క్యాలరీలు లభిస్తాయి. ఇంకా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి మన శరీరానికి మేలు చేయడంతో పాటు వేసవితాపం నుండి బయటపడేసే ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. బటర్ మిల్క్, పెరుగు, చియా విత్తనాలు ఇంకా సబ్జా గింజలు వంటి వాటిని తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి చాలా మేలు కలగడంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వేసవి తాపం నుండి కూడా చాలా ఈజీగా ఉపశమనం లభిస్తుంది.అయితే వేసవి కాలంలో కొన్ని రకాల డ్రింక్స్ రోజూ ఉదయం పరగడుపున తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అలాగే వీటిని తీసుకోవడం వల్ల వేసవికాలంలో తలెత్తే అనారోగ్య సమస్యల బారిన పడుకుండా ఉండవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేసవికాలంలో తీసుకోవాల్సిన డ్రింక్స్ ఏమిటి ఇంకా వీటిని ఎలా తయారు చేసుకోవాలి వంటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.


వేసవికాలంలో ఖచ్చితంగా నీటిని ఎక్కువగా తాగాలి. ప్రతి రోజూ ఉదయం పరగడుపున రెండు గ్లాసుల నీటిని తప్పకుండా తాగాలి. ఎందుకంటే ఇది శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంలో సహాయపడతాయి.ఇంకా అలాగే వేసవికాలంలో పెరుగును తీసుకోవడం వల్ల చాలా మంచి ఫలితం ఉంటుంది. అర కప్పు పెరుగులో కొద్దిగా అల్లం తరుగు, కొద్దిగా పసుపు ఇంకా మిరియాల పొడి వేసి కలిపి ప్రిజ్ లో ఉంచాలి. దీనిని పొద్దున్నే తినడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అలాగే కీరదోస జ్యూస్ ను కూడా ఎక్కువగా తీసుకోవాలి. జార్ లో కీరదోస ముక్కలు, 4 పుదీనా ఆకులు ఇంకా ఒక చిటికెడు చాట్ మసాలా ఒక టీ స్పూన్ పచ్చి మామిడికాయ ముక్కలు వేసి జ్యూస్ లాగా చేసుకుని తాగితే ఖచ్చితంగా మంచి ఫలితం ఉంటుంది.ఇలా తాగడం వల్ల శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా ఉంటారు. ఇంకా అలాగే ఒక గ్లాస్ నీటిలో నిమ్మరసం, నానబెట్టి చియా విత్తనాలు పావు టీ స్పూన్ మోతాదులో కలిపి  తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బాగా మెరుగుపడడంతో పాటు శరీరం డీ హైడ్రేషన్ బారిన పడకుండా కూడా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: