ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాలు ఎలా ఉన్నారంటే ఈజీగా డబ్బులు ఎలా వస్తాయని ఆలోచిస్తుంటారు.. అది నిజమే అనుకోండి.. ఎందుకంటే కరోనా మహమ్మారి కారణంగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రజలకు అలాంటి ఆలోచనలు రావడం సహజమే.. అయితే ఇప్పుడు తక్కువ డబ్బును పెట్టీ ఎక్కువ లాభాలను పొందే స్కీమ్ లు చాలానే వచ్చాయి.. వాటిలో కొన్ని స్కీమ్ లు మాత్రం నమ్మశక్యంగా ఉంటాయి. అలాంటి అత్యున్నత స్కీమ్ పోస్టాఫీసు వారు అందిస్తున్నారు.అదేంటో ఇప్పుడు చూద్దాం..




పోస్టాఫీసు లో చాలా రకాల స్కీమ్ లు ఉన్నాయి.. వీటిల్లో కిసాన్ వికాస్ పత్ర స్కీమ్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో డబ్బులు పెడితే మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. ఎలాంటి రిస్క్ ఉండదు. కచ్చితమైన లాభం వస్తుంది. అయితే ఇక్కడ డబ్బులు రెట్టింపు కావాలంటే మాత్రం దీర్ఘకాలం వేచి ఉండాలి..కేంద్ర ప్రభుత్వం స్కీమ్ ను ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చింది.డబ్బులు పెట్టిన వారికి గ్యారంటీ డబుల్ రిటర్న్ వస్తుంది. అందువల్ల మీ డబ్బు కేంద్ర ప్రభుత్వం దగ్గర భద్రంగా ఉంటుంది. డబ్బులు పెడితే ఎక్కడికి పోదు.. అందుకే అంటారు..ఏదైనా చేసేటప్పుడు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్న వాటిలో ఇన్వెష్ట్ చేస్తే డబ్బులు ఎక్కడికి పోవు..



కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ మెచ్యూరిటీ కాలం 124 నెలలు. ఈ కాలంలో మీ డబ్బులు రెట్టింపు అవుతాయి. కేంద్ర ప్రభుత్వం మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బుకు 6.9 శాతం వడ్డీ రేటును అందిస్తుంది..ఈ స్కీమ్ లో జాయింట్ అకౌంట్ ఫెసిలిటీ కూడా ఉంది..ఈ కేవీపీ స్కీమ్‌లో కనీసం రూ.1,000 నుంచి ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కనీసం 18 ఏళ్ల వయసు దాటి ఉండాలి. గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత డబ్బునైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఉదాహరణకు మీరు రూ.లక్ష పెడితే రూ.2 లక్షలు వస్తాయి.. మొత్తానికి ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే రెట్టింపు అవుతాయి.. మరి ఇంక ఆలస్యం ఎందుకు చిన్న మొత్తంలో డబ్బులు పెట్టీ పెద్ద మొత్తంలో  లాభాలను పొందండి..

మరింత సమాచారం తెలుసుకోండి: