తెలుగు,తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగిన నయనతార కొంత కాలంగా తెలుగులో చాన్సులు తగ్గినా తమిళంలో మాత్రం బాగానే నటిస్తుంది. కాలేజీ రోజుల నుంచే మోడలింగ్ చేసే నయన్‌ను చూసిన మలయాళీ డైరెక్టర్ సత్యన్ అంతిక్కాడ్ 'మనస్సినక్కరే' అనే సినిమాలో హీరోయిన్‌గా ఆమెకు తొలి ఛాన్స్ ఇచ్చాడు. ఆ తర్వాత 'విస్మయతుంబట్టు', 'తస్కర వీరన్', 'రాప్పకల్' వంటి సినిమాల్లో మోహన్‌లాల్, మమ్ముట్టి వంటి పెద్ద హీరోలతో చేసింది.తర్వాత తమిళంలో 'అయ్య', 'చంద్రముఖి', 'గజిని' వంటి సినిమాల్లో నటించింది. తెలుగులో చేసిన 'లక్ష్మీ', 'బాస్' చిత్రాలు ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అప్పట్లో నయన్ ని ఎన్నో వివాదాలు చుట్టుముట్టాయి.  

వ్యక్తిగత విషయాలతోనూ వార్తల్లో నిలిచింది ఈ నటి. మొదట్లో వల్లవన్ షూటింగ్ సమయంలో ఆ సినిమా డైరెక్టర్, తన సహనటుడు శింబుతో ఆమె ప్రేమలో ఉందంటూ వార్తలొచ్చాయి. తర్వాత బ్రేకప్ కావడం డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్ ప్రభుదేవతో పెళ్లి వరకు వచ్చి తర్వాత బ్రేకప్ కావడం జరిగింది. కానీ తర్టి ప్లేస్ అయినప్పటికీ యంగ్ హీరోయిన్ లకు పోటిగా దూసుకుపోతు మరింత క్రేజ్ పెంచుకుంటూ వస్తోంది. దీంతో ఈ అమ్మడు రెమ్యూనరేషన్ ని అమాంతం పెంచేసిందట.

నయనతార


ఇప్పటి వరకు నయన్ 2.5 కోట్లు తీసుకుంటున్న విషయం తెలిసిందే..అయితే ఇప్పుడు  ఏకంగా నాలుగు కోట్లు ఇస్తేనే సినిమా చేసేది అని తన వద్దకు వచ్చిన నిర్మాతలను వణికిస్తోందట. ఇటీవలే ఈ భామను కలిసిన నిర్మాతలు ఆమె అంత రెమ్యునరేషన్ అనడంతో దెబ్బకి షాక్ అయ్యారట. ఏది ఏమైనా ఈ అమ్మడు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: