టాలీవుడ్ లో మెగాస్టార్ వారసులుగా ఎంట్రీ ఇచ్చిన హీరోల మద్య ఇప్పటి వరకు ఎలాంటి పోటీలు కానీ..వివాదాలు కానీ జరగలేదు. కానీ ఆ మద్య విజయవాడలో  విజయవాడలో జరిగిన 'సరైనోడు' సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గురించి 'చెప్పను బ్రదర్' అనే మాట సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన పై బన్నీ పై పవన్ ఫాన్స్ విరుచుకుపడ్డారు. ఇది చిలికి చిలికి గాలి వాన కావడంతో మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంలో జోక్యం చేసుకొని బన్నీకి కాస్త క్లాస్ కూడా పీకినట్లు సమాచారం. అయితే ఈ విషయానికి ఎక్కడో అక్కడ పులిస్టాప్ పెట్టాలనుకున్న బన్నీకి నిన్న ‘ఒక మనసు’ వేదిక అయ్యింది.

మెగా బ్రదర్ నాగబాబు ఫ్యామిలీ


మొన్న పవన్ గురించి చెప్పను బ్రదర్ అని ఎందుకన్నాడో బన్నీ క్లారిటీ ఇచ్చేసాడు.. ఈ విషయం గురించి అసలు బన్ని ఏమన్నాడో ఒక్కసారి చూద్దామా..! మీరు ప్రతీసారి పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిసినప్పుడు.. నేను మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాను. దానికి పవన్ కళ్యాణ్ గారు అస్సలు కారణం కాదు. నేను మాట్లాడకుండా వెళ్ళిపోవడానికి కారణం ఎవరో కాదు మీరే.. అంటే మెగా ఫ్యామిలీ మొత్తం అని కాదు అందులో ప్రత్యేకంగా పవన్ కళ్యాన్ ఫ్యాన్స్ మాత్రమే చెబుతున్నాను. నేను ఆ ప్రత్యేకంగా ఆ గ్రూప్ వల్లే ఆయన గురించి టాపిక్ అవైడ్ చేసాను.

నాగబాబు, బన్ని


వాస్తవానికి ఇలాంటి వేదికలు ఎప్పుడో అప్పుడు వస్తాయి..ఈ సందర్భంగా ఫ్యాన్స్ తో ఎంతో మాట్లాడని తమ మనసులో ఉన్న విషయాలు అభిమానులతో షేరు చేసుకోవాలని మాకు ఉంటుంది..ఆ సందర్భంలో వాళ్ళ మాటల మధ్యలో మీరు పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరిస్తే.. అంత పెద్ద హీరో గురించి ఏదో మా మాటలు ఆపేసి మెకానికల్ గా మాట్లాడాల్సి వస్తుంది. అది మీకు ఆనందంగా ఉంటుందేమో కానా మాకు మాత్రం చాలా బాధగా ఉంటుంది. మీరు ఇలాంటి ఫంక్షన్లో ఎంజాయ్ చేయండి..అరవండి కానీ కాస్త లిమిట్ లో ఉండండి.

ఒక మనసు లో దృశ్యం


ఆర్టిస్టులు మాట్లాడేటప్పుడు మధ్య లో అలా అరిస్తే బాగోదు కదా అన్నారు. ఒక పెద్ద డైరెక్టర్ ఒక పెద్ద సినిమా తీసి ఆ సినిమా గురించి మాట్లాడాలని ఒక ఫంక్షన్ పెడితే ఆ ఫంక్షన్ లో ఆయన ఫీలింగ్స్ చెప్పుకోనివ్వకుండా మధ్యలో పవర్ స్టార్ పవర్ స్టార్ అని అరుస్తుంటే తప్పు బ్రదర్" అంటూ పవన్ ఫాన్స్ పై ఫైర్ అయ్యాడు అల్లు అర్జున్.  ఇలా 'సరైనోడు' సక్సెస్ మీట్ లో జరిగిన దానికి వివరణ ఇచ్చారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: