ప్రముఖ నటుడు రజనీకాంత్‌ రెండో కుమార్తె సౌందర్య తన భర్త నుంచి విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. పారిశ్రామికవేత్త అశ్విన్‌ రామ్‌కుమార్‌ను 2010లో ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ ఏడాది మేలో ఈ జంటకు కుమారుడు జన్మించాడు. కొన్ని నెలలుగా వారి మధ్య విభేదాలు తలెత్తినట్లు తెలుస్తోంది.  అయితే ఇది పూర్తిగా తమ కుటుంబ వ్యవహారమని, దయచేసి దీనిపై అనవసర ఊహాగానాలు చేయవద్దంటూ ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు.

Image result for rajinikanth daughter divorce

ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, పెద్దది చేయవద్దని విజ్ఞప్తి చేశారు. తమ కుటుంబానికి మద్దతుగా నిలుస్తున్న సోదరి ఐశ్వర్య భర్త ధనుష్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గ్రాఫిక్స్ టెక్నాలజీలో నిపుణురాలైన సౌందర్య 2010లో వ్యాపారవేత్త అశ్విన్ రామ్‌కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఇటీవలే వీరికి బాబు పుట్టాడు. తండ్రి రజనీకాంత్ నటించిన యానిమేషన్ చిత్రం ‘కోచ్చడైయాన్’తో దర్శకురాలిగా తానేంటో నిరూపించుకున్నారు. గోవా చిత్రం ద్వారా నిర్మాతగానూ మారిన సౌందర్య ధనుష్ హీరోగా ఓ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. 


Image result for rajinikanth daughter divorce

ఇటీవల సినీ ప్రముఖుల విడాకుల వార్తలు హల్ చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ కోవలోకి సౌందర్య కూడా చేరడంతో విస్తృత ప్రచారం జరిగింది. మీడియాలో ఆమె విడాకుల వార్తలు ప్రముఖంగా వస్తుండడంతో సౌందర్య స్పందించక తప్పలేదు. ఇప్పటికే కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించారని, మరికొన్ని నెలల్లో విడాకులు మంజూరయ్యే అవకాశముందని తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు తమిళ పత్రికల్లో కూడా వార్తలు ప్రచురితమయ్యాయి. ఇరు కుటుంబాల నుంచి మాత్రం దీనిపై ఎలాంటి స్పందన రాలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: