కాంచన, అధినాయకుడు... చిత్రాల్లో నటించిన లక్ష్మీరాయ్ ఒక పత్రిక పై కేసు వేసింది. తన మీద అసత్య ప్రచారం చేస్తున్నారంటూ లక్ష్మీరాయ్ తన ఫిర్యాదులో పేర్కొంది. లక్ష్మీరాయ్ ప్రస్తుతం సెల్వకుమార్ దర్శకత్వంలో ఒక తమిళ సినిమాలో నటిస్తుంది. ఈ చిత్రంలో హీరో, లక్ష్మీరాయ్ ల గురించి ‘కుముదం’ అనే పత్రిక ఒక కథనం ప్రచురించింది. అయితే ఈ కథనం పూర్తి అసత్యమని, ఈ వార్తతో తన గౌరవానికి భంగం కలుగుతుందని లక్ష్మీరాయ్ చెన్నై హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. తనపై అవాస్తమైన కథనం ప్రచురించినందుకు తనకు క్షమాపణలు చెప్పాలని, 30 లక్షల రూపాయిల నష్ట పరిహారం చెల్లించాలని లక్ష్మీరాయ్ తన ఫిర్యాదులో డిమాండ్ చేసింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: