ఉత్తరప్రదేశ్ లోని సమాజ్వాద్ పార్టీలో సంక్షోభానికి కారణమయ్యాడంటూ విమర్శలు ఎదుర్కొంటున్న అమర్సింగ్ మరో సంచలన విషయం వెల్లడించాడు. బాలీవుడ్ దిగ్గజ నటుడు, బిగ్బీ అమితాబ్ బచ్చన్ ఆయన భార్య జయాబచ్చన్ మధ్య విభేదాలు ఏర్పడ్డాయని వెల్లడించారు. అంతేకాదు వారిద్దరూ వేర్వేరుగా నివసిస్తున్నారని తెలిపారు. అత్తాకోడళ్లు జయాబచ్చన్, ఐశ్వర్య రాయ్ లకు కూడా పడడంలేదని అమర్ సింగ్ చెప్పినట్టు ‘ఏబీపీ మజ్హా’ వార్తా సంస్థ పేర్కొంది.
వీరి మధ్య ఎప్పట్నుంచో కలతలు విభే దాలు ఉన్నాయని, వారిద్దరూ ఇప్పుడు వేర్వేరు ఇళ్లలో నివాసముంటున్నారని అమర్సింగ్ చెప్పినట్టు "ఏబీపీ మజ్హా" అనే వార్త సంస్థ ఓ కథనం ప్రచురించింది. ఈ కథనం బాలీవుడ్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రతి విషయంలో గొడవలకు తానే కారణం అన్నట్టుగా మీడియా చూపుతుందని ఆయన వాపోతూ....
"ప్రతీక్ష "
"నేను బచ్చన్ కుటంబంతో కలిసే నాటికే అమితాబ్, జయ విడివిడిగా ఉంటున్నారు. కేవలం బయటి ఫంక్షన్లకు మాత్రమే వారు కలిసి హాజరవుతుంటారు. ఒకరు 'ప్రతీక్ష్' (వారు నివాసం ఉండే ఇంటి పేరు) లో ఉంటే, మరొకరు 'జానక్' లో నివసిస్తు న్నారు. జయా బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్ లకు కూడా అసలు పడదు. వాటకి కూడా నేను బాధ్యత వహించాలా? ప్రతీ విషయంలోనూ గొడవకు నేను కారణమంటూ మీడియా నా వైపే చూస్తోంద" ని అమర్సింగ్ అన్నారు.
"జనక్"
సమాజ్ వాదీ పార్టీ లో చేరొద్దని జయను అమితాబ్ హెచ్చరించారని గతంలో అమర్ సింగ్ చెప్పారు. మొదట్లో అమర్ సింగ్ తో సన్నిహితంగా మెలగిన అమితాబ్ తర్వాత ఆయనను దూరం పెట్టారు గతంలో అమితాబ్, అమర్సింగ్ ప్రాణస్నేహితులనే విషయం తెలిసిందే. తర్వాత ఏమైందో వారిద్దరూ విడిపోయారు. కాగా, అమర్సింగ్ వ్యాఖ్య లకు బచ్చన్ కుటుంబం ఎలాంటి సమాధానం చెబుతుందో స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
"జల్సా"