దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ ప్రొడక్షన్ రంగంలో సెటిల్ అవ్వడానికి ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. సినిమాలకు దర్శకత్వం వహించే సమర్ధత ఉన్నా అతడి అభిరుచి అంతా సినిమాల నిర్మాణం వైపు ఉండటంతో అతడు  ప్రస్తుతం కొన్ని సినిమాలకు లైన్ ప్రొడ్యూసర్‌ గా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.     

అయితే కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా నిర్మాణ భాద్యతలు నిర్వహిస్తున్న ఒక సినిమా విషయంలో  కార్తికేయ తనను మోసం చేసాడు అంటూ ఒక వ్యక్తి తన పేరు బయట పెట్టకుండా ఒక ప్రముఖ ఇంగ్లీష్ పత్రికకు అందించిన సమాచారాన్ని ఆ పత్రిక ప్రముఖంగా ప్రచురించడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. 

ఆసక్తికరమైన ఈ వార్త వివరాలలోకి వెళ్ళితే  తాము నిర్మిస్తున్న సినిమాకు డ్రోన్ ఆపరేటర్లు కావాలంటూ వారాహి చలన చిత్రసంస్థ తన చేత పనులు చేయించుకుని తన డ్రోన్లను వారి వద్దే పెట్టుకుని తనకిచ్చే డబ్బులను కూడ ఇవ్వలేదని ఆపేరు బయట పెట్టని వ్యక్తి చెపుతున్నట్లుగా ఆఆంగ్ల పత్రిక సంచలన కధనాన్ని ప్రచురించింది. 

అయితే ఈ సినిమాకు కార్తికేయ లైన్ ప్రొడ్యూసర్ గా వ్యహరించడంతో ఈవిషయంలో కార్తికేయ పేరును కూడ ఆ పత్రిక ప్రముఖంగా రాసింది. నాగచైతన్య హీరోగా వస్తున్న ‘యుద్ధం శరణం’ సినిమా ‘వారాహి చలన చిత్రం' బేనర్లో  రూపొందింపడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యహారం అంతా ఆ సినిమాకు సంబంధించిందే అంటూ ఆ పత్రిక రాసిన కధనం నేటి రోజు హాట్ న్యూస్ గా మారింది. అయితే ఈ విషయమై కార్తికేయ ఎలా స్పందిస్తాడో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: