ఎల్లప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచిపోయే బాలివుడ్ అందాల తార ఎవరో కాదు మన రాఖీసావంత్‌. 2006 లో టెలివిజన్ సీరీస్ బిగ్ బాస్ మొదటి సీజన్ లో కంటిస్టెంట్ గా కూడా నిలిచారు.చాలా రోజుల తరువాత ఈ బ్యూటీ మళ్లీ ఒక వివాదాస్పద వ్యాఖ్యలకు తావునిచ్చింది. వివరాళ్లో కి వెళ్తే 25 నవంబర్ 1978 లో జన్మించిన ఈ ముద్దు గుమ్మ మంచి డ్యాన్సర్ గా,మోడల్ గా ,నటీ,సినిమాలే కాక   టెలివిజన్  టాప్ షో లో హోస్ట్ గా కూడా చేసి తన సత్తా చాటుకుంది.




ఇప్పుడు ఈ అందాల తార సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నారంటూ కొంతకాలంగా సోషల్‌ మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. పైగా ఎప్పటికప్పడు వెడ్డింగ్‌ డ్రెస్‌ తో, నిండైన పెళ్లికూతురు గెటప్‌లో ఉన్న ఫొటోలను సోషల్‌ మీడియాలో పంచుకోవడంతో ఈ ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి. కానీ రాఖీ వాటిని కేవలం ఫొటోషూట్‌ కోసమేనంటూ ముందు బుకాయించినప్పటికీ అసలు విషయం దాగలేదు. ఇటీవలే తన వివాహం బ్రిటన్‌కు చెందిన ఓ ఎన్నారై బిజినెస్‌మాన్‌ రితేశ్‌ తో జరిగిందని చేప్పింది. ఓ టీవీ ఇంటర్వ్యూలో రాఖీ  మాట్లాడుతూ ‘రితేశ్‌ నా వీరాభిమాని అని, ఓ ఇంటర్వ్యూలో తనను మొదటిసారిగా చూశాడని,తర్వాత మెసేజ్‌లు, కాల్స్‌తో దగ్గరయ్యాం అని,ఇద్దరం మంచి మిత్రులయ్యాం అని, క్రమేణా మా బంధం మరింత బలపడి ప్రస్తుతం పెళ్లితో ఒక్కటయ్యాం.




నేను జీవితాంతం తనతో సంతోషంగా గడపాలనుకుంటున్నాను అని తన భావాన్ని వెల్లడించింది రాఖీ. వీరిద్దరూ పెళ్లికి ముందే ఏడాదిన్నరపాటు డేటింగ్‌లో ఉన్నారంటూ వీరి మధ్య ప్రేమ బలపడటంతో ముంబైలోని ఓ హోటల్‌లో రాఖీసావంత్‌, రితేశ్‌లు సీక్రెట్‌గా వివాహం చేసుకున్నారంటూ వచ్చిన కధనాలతో, ఇందుకు సంబంధించిన ఫొటోలు, వార్తలు  బయటికి రావడంతో  ‘అవును నేను పెళ్లి చేసుకున్నాను’ అంటూ రాఖీ సావంత్‌ అసలు నిజాన్ని బయటపెట్టేసింది. తనకింకా వీసా రాలేదంటూ, వీసా రాగానే తనతోపాటు వెళ్లడానికి సిద్దంగా ఉన్నట్లు వెల్లడించింది ఈ అందాల తార. వైవాహిక జీవితం తరువాత కూడా టీవీ షో లో నటించాలన్న తన కోరికను నెరవేర్చుకుంటానంటూ గట్టిగా తెలియజేసింది. తన వైవాహిక జీవితం గురించి కూడా ముందస్తు ఆలోచనలోనే ఉంటూ ఫ్యామిలీ ప్లానింగ్‌ను కూడా అప్పుడే నిర్ణయించేసుకుందట మన రాఖీ. 2020లో పిల్లల్ని కనాలి అనుకుంటున్నానని చెప్పుకొస్తూ అసలు విషయాన్ని బయటపెట్టింది ఈ ముద్దు గుమ్మ.


మరింత సమాచారం తెలుసుకోండి: