వరుస పరాజయాలతో  సతమతమవుతున్న  యంగ్ హీరో  రాజ్ తరుణ్ ఈ సారి  రీమేక్ సినిమాను నమ్ముకున్నాడు.  బాలీవుడ్ లో ఇటీవల విడుదలై  100కోట్లకు పైగా  వసూళ్లను రాబట్టి సూపర్ హిట్ అనిపించుకున్న డ్రీం గర్ల్ చిత్రాన్ని  తెలుగులో రీమేక్ చేయనున్నారు.  ఈ రీమేక్ హక్కులను  ప్రముఖ నిర్మాత సురేష్ బాబు సొంతం చేసుకున్నాడు.   ఇక ఈరీమేక్ లో  రాజ్ తరుణ్ హీరో గా నటించనుండగా  అలా ఎలా ఫేమ్  అవీష్ కృష్ణ డైరెక్ట్ చేయనున్నాడు.  అయితే గతంలో  రాజ్ తరుణ్ -అవీష్ కలయికలో  వచ్చిన  లవర్  నిరాశపరించింది. అయినా కూడా  మరోసారి  అవీష్ తో  రిస్క్ చేస్తున్నాడు  రాజ్ తరుణ్.  త్వరలోనే  ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. 

ఇక  రాజ్ తరుణ్ ప్రస్తుతం,  రెండు సినిమాల్లో నటిస్తున్నాడు అందులో ఒకటి నీది నాది ఒకటే లోకం కాగా రెండవది ఒరేయ్ బుజ్జిగా.  ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్న ఈ  చిత్రంలో అర్జున్ రెడ్డి ఫేమ్ షాలిని పాండే హీరోయిన్ గా నటిస్తుండగా కృష్ణా డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం  ఈఏడాది చివర్లో విడుదలకానుంది.


ఇక ఈ సినిమా తో పాటు రాజ్ తరుణ్  గుండెజారి గల్లంతయ్యిందే ఫేమ్  విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో ఒరేయ్ బుజ్జిగా అనే చిత్రంలో కూడా నటిస్తున్నాడు. రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న  ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా   మాళవిక నాయర్  కథానాయికగా నటిస్తుంది. ఈరెండు చిత్రాలను  పూర్తి చేసిన తరువాత రాజ్ తరుణ్ డ్రీం గర్ల్ రీమేక్ ను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నాడు. మరి  ఈమూడు సినిమాలు రాజ్ తరుణ్ కు ఎలాంటి ఫలితాన్ని ఇస్తాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: