నచ్చావులే సినిమాతో టాలీవుడ్ కు పరిచయమైన మాధవీలతకు, ఈ సినిమా హిట్టయినా పెద్దగా అవకాశాలు రాలేదు. టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై స్పందించి వార్తల్లో నిలుస్తూ వస్తున్నారు మాధవీలత. తాజాగా మాధవీలత నెటిజన్స్ పై ఆగ్రహంతో ఊగిపోయారు. సోషల్ మీడియాలో నెటిజన్స్ పై రెచ్చిపోయింది ఈ అమ్మడు. 

 

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిశ హత్య కేసుపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను ఉద్దెశించి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టింది మాధవీలత " ఏంది సీఎం కెసిఆర్ సారూ, దేశ వ్యాప్తంగా దిశ హత్య కేసు గురించి స్పందిస్తే మీరు మాత్రం గమ్మున ఉన్నారు, మీ ఇంట్లో ఆడపిల్లకు గిట్లనే జరిగితే స్పందించరా?. జరా కోర్టులో ఫాస్ట్ గా విచారణ జరిపించి గా నిందితులకు శిక్ష వేయించండి" అని సోషల్ మీడియా లో తెలంగాణ స్లాంగ్ లో పోస్ట్ పెట్టినట్లు ఒక టీవీ ఛానల్ చర్చలో పాల్గొన్న మాధవీలత తెలిపారు. 

 

మాధవీలత పోస్ట్ పై స్పందించిన ఒక నెటిజెన్ "ఏందే నీ గోల. నీ లాంటి వాళ్లు ఉంటే ఇలానే చంపేస్తారు" అంటూ కామెంట్ చేసాడు. ఈ కామెంట్ కు స్పందించిన మాధవీలత "రేపిస్టులు అంటే అలానో ఇలానో ఉంటారు అని టీవీలో చూశాను, పేపరల్లో చదివాను కానీ రేపిస్టులు అంటే నీలా ఉంటారు అని ఫస్ట్ టైమ్ నా ఫేస్ బుక్ లో చూశాను నీ సంస్కారం ఏంటో, నీ తల్లిదండ్రలు నిన్ను ఎంత గొప్పగా పెంచారో నీ కామెంట్ చూస్తేనే అర్థమవుతుంది" అంటూ మాధవీలత కామెంట్ చేశారు. 

 

మాధవీలత కామెంట్ కు తిరిగి స్పందించిన నెటిజెన్ "హేయ్ పోవే లం... నీ కామెంట్ చూస్తుంటేనే అర్ధం అవుతుంది నీ సంస్కారం ఏంటో" అంటూ ప్రతిస్పందించగా. దీనితొ ఆగ్రహంతో ఊగిపోయిన మాధవీలత తన సోషల్ మీడియా అకౌంట్ లో నెటిజన్స్ పై ఫైర్ అయ్యారు. "మహిళల గురించి ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి కోసి కారం పెట్టాలి, సిగ్గు, లజ్జ ఉందరా మీకు?, పోలీస్ స్టేషన్ లోనే రేపులు చేసే లుచ్చా లఫంగులు మీరు. రేప్ చేస్తే సుఖమా? పోయి చెట్టు తొర్రలో పెట్టుకోండ్రా" అంటూ త్రీవమైన పదజాలంతో విరుచుకుపడ్డారు మాధవీలత.

మరింత సమాచారం తెలుసుకోండి: