హీరోయిన్‌లు సోనమ్‌ కపూర్‌, పూజా హెగ్డేలు  బ్రిటీష్‌​ ఎయిర్‌వేస్ నిర్లక్ష్యంపై భారీ ఎత్తున్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బ్రిటీష్‌​ ఎయిర్‌వేస్ ప్రయాణికుల బ్యాగేజీని వారికి అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను గురించి ఈ ఇద్దరు ముద్దు గుమ్మాలు  ప్రస్తావించారు. నిజానికి ఈ సంస్థ వ్యవహరించే తీరు ఏం బాగోలేదని వారు మండిపడ్డారు.  

 

రెండు సార్లు బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ లో ప్రయాణం చేయడం వల్ల  తన బ్యాగ్‌ను  పోగొట్టిందని తెలిపిన సోనమ్‌.. అంతేకాదు మరోసారి ఈ బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌ లో నేను ఇక ప్రయాణించబోనని ఆమె స్పష్టం చేశారు. ‘ఈ నెలలో బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించడం నాకు ఇది మూడోసారి.. అందులో రెండుసార్లు ప్రయాణించడం వల్ల నేను  నా బ్యాగ్‌ను పోగొట్టారు. వారి చర్య నాకు ప్రతి సారి గుణపాఠం నేర్పింది. ఇకపై బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌లో ప్రయాణించను’అని ఆమె పేర్కొన్నారు.

 

సోనమ్‌ ఈ విషయం పై  ట్వీట్‌ చేయడంతో దీనికపై  పూజా హెగ్డే   కూడా స్పందించారు.‘అవును. గత నెలలో నా బ్యాగ్‌లను కూడా వాళ్లు పోగొట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు వాటిని కొరియర్‌లో పంపించారు. చూస్తుంటే.. ఇదంతా వారికి అలవాటే అనిపిస్తోంది’ అని అన్నారు. కాగా, సోనమ్‌ ట్వీట్‌పై స్పందించిన బ్రిటీష్‌ ఎయిర్‌వేస్‌.. బ్యాగేజీ విషయంలో ఆలస్యం జరుగుతున్నందుకు క్షమించాల్సిందిగా కోరింది. బ్యాగేజీ గురించి ఎయిర్‌పోర్ట్‌లో సమాచారం ఇచ్చినప్పుడు.. ట్రాకింగ్‌ సూచన ఏమైనా చేశారా అని సోనమ్‌ను అడిగింది.

 

ఎయిర్‌వేస్‌ ప్రశ్నలకు సోనమ్‌ బదులిస్తూ.. ‘అదంతా చేశాను.. కానీ ఆ ప్రక్రియ చాలా అసౌకర్యంగా ఉంది. ఇలాంటివి జరగకుండా.. మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. ఇది చాలా భయంకరమైన సర్వీస్‌, నిర్వహణ కూడా చెత్తగా ఉంద’ని తెలిపారు. దీనిపై ఈ ఘటనపై తాము తాము క్షమాపణలు మాత్రమే చెప్పగలమని పేర్కొంది. వీలైనంతా తొందరలో బ్యాగేజ్‌ను సోనమ్‌ వద్దకు చేరుస్తామని హామీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: