పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఎస్.జె సూర్య డైరక్షన్ వచ్చిన సూపర్ హిట్ మూవీ ఖుషి. పవన్, భూమిక జోడీగా నటించిన ఈ సినిమా అప్పట్లో యూత్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. సినిమాకు మణిశర్మ మ్యూజిక్ హైలెట్ గా నిలిచింది. అయితే మణిశర్మ ఈ సినిమాకు కేవలం 3 అంటే మూడే రోజుల్లో సినిమాను కంప్లీట్ చేశారట. ఆ టైంలో తను బిజీగా ఉండటం వల్ల ఖుషికి ఎక్కువ టైం తీసుకునే వీలు కుదరలేదని. మూడు రోజులు ఉదయం 7 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు కూర్చుని మ్యూజిక్ పూర్తి చేశారట. 

 

మణిశర్మ రీసెంట్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెళ్లడించారు. కేవలం 3 రోజుల్లో ఆల్బం పూర్తి చేసినా సరే మ్యూజిక్ మాత్రం అదిరిపోయిందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఎవర్గ్రీన్ హిట్ ఆల్బంస్ లో ఖుషి ఒకటి. ఇప్పటికి ఆ సినిమాలోని పాటలకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి నటించిన మృగరాజు సినిమాకు బాగా కష్టపడాల్సి వచ్చిందట. ఆ సినిమాకు మ్యూజిక్ విషయంలో ఎంతో కష్టపడితే సినిమా మాత్రం నిరాశపరచిందని అన్నారు మణిశర్మ. 

 

ఈమధ్య కొద్దిగా వెనుకపడ్డట్టు అనిపించిన మణిశర్మ లాస్ట్ ఇయర్ వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సెన్సేషనల్ హిట్ సాధించాడు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు మణిశర్మ. చిరు సినిమాకు మణిశర్మ మ్యూజిక్ ఎంత పెద్ద అసెట్ అన్నది ఇంద్ర సినిమాలో వీణ స్టెప్పు చూస్తేనే తెలుస్తుంది. మరి అలాంటి మ్యాజిక్ మళ్లీ క్రియేట్ చేస్తారో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటుగా స్టార్ హీరోల సినిమాలకు కూడా మణిశర్మ మ్యూజిక్ కంటిన్యూ కబోతుందని తెలుస్తుంది. ఒకప్పుడు స్టార్స్ అందరికి మొదటి ఆప్షన్ అయిన మణిశర్మ యువ సంగీత దర్శకుల ఎంట్రీతో కొద్దిగా వెనుకపడ్డాడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: