సినిమా రంగం కొందరికి మల్టీపర్పస్‌గా మారింది. ఇందులోకి వచ్చిన వారు ఒక శాఖలో విజయాన్ని అందుకో లేకపోతే మరో శాఖలోకి ఎంటర్ అయ్యి తమ విజయాన్ని వెతుక్కుంటున్నారు. ఈ కోవలోకే మరో ఫ్యామిలీ దర్శకుడు చేరబోతున్నాడు. మొదట తన ప్రయాణాన్ని రచయితగా ప్రారంభించి తరువాత దర్శకుడిగా దొంగల బండి సినిమాతో కొత్త అవతారం ఎత్తిన వ్యక్తి సతీష్ వేగేశ్న.


ఈ చిత్రం అనుకున్నంతగా విజయాన్ని అందించలేక పోవడంతో ఈ దర్శకునికి చాలా గ్యాప్ వచ్చింది. కానీ శతమానంభవతి అనే సినిమాతో దర్శకుడుగా మొట్టమొదటి విజయాన్ని అందుకున్నాడు. ఈ చిత్రంతో తనకు ఫ్యామిలీ కధలు కలిసి వస్తాయని భావించిన ఈ దర్శకుడు తర్వాత నితిన్ హీరోగా శ్రీనివాస కళ్యాణం అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కంటెంట్ భాగానే ఉన్న మరీ ఎక్కువగా నీతులు చెప్పడం వల్ల ఈ జెనరేషన్ పక్కన పెట్టేసారు..


అయినా మరో ప్రయత్నంగా కళ్యాణ్ రామ్ ను పెట్టి ఎంత మంచి వాడవురా అంటూ ఫ్యామిలీ డ్రామాతోనే మరో సారి, కుటుంబం, బంధాలు, విలువలు అంటూ అంతరించిపోయిన ఎమోషన్స్ ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు. కానీ పాతచింతకాయ పచ్చడి అంటూ అందరు ముఖం చాటేసారు. ఫలితంగా ఈ సినిమా కూడా డిజాస్టర్ అయ్యింది.ఇలా తన దర్శక ప్రయాణంలో ఏం నీతి తెలుసుకున్నాడో తెలియదు గానీ ఈ సారి కంప్లీట్ గా జోనర్ మార్చేస్తున్నారు సతీష్ వేగేశ్న..


ఇందులో భాగంగా తన కొడుకు సమీర్ ను హీరోగా పరిచయం చేస్తూ ఓ సినిమా ప్లాన్ చేస్తున్నాడు.. దీని కోసం పక్కా యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కథని సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఇందులో కూడా తన మార్క్ ఫ్యామిలీ ఎమోషన్స్ చూపిస్తే మాత్రం ఈ దర్శకుడు సక్సెస్ అందుకోడనే మాట వినిపిస్తుంది. కాగా తానే నిర్మాతగా ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు ప్రచారం జరుగుతుందట..


మరింత సమాచారం తెలుసుకోండి: