నందమూరి అభిమానులను ఊరించి ఊరించి చంపుతున్న విషయం ఒకటి ఉంది.. అది బాలకృష్ణకు కూడా ఒక సమస్యగా మారింది.. మరి ఆ సమస్య తీరడానికి ఎప్పటి నుండో ప్రయత్నాలు చేస్తున్న అది ఫలించడం లేదు. ఇంతకు ఇంతలా పరెషాన్ చేస్తున్న విషయం ఏంటని ఆలోచిస్తున్నారా.. అదేనండి మోక్షజ్ఞ వెండితెర ఎంట్రీ..


ఇది వరకే స్టార్ హీరోల కొడుకులు వెండి తెరమీద జిగెల్ అంటున్నారు. మరి నట సింహం నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎప్పుడు తన పదునైన డైలాగులతో ప్రేక్షకుల్ని మురిపించి మై మరిపిస్తాడో అని సినిమా పక్షులందరు ఆశతో ఎదురు చూస్తున్నారట.


ఇకపోతే ఐదేళ్ల క్రితమే మోక్షజ్ఞకు హీరోగా మారే వయసొచ్చిందట. కానీ తాను మాత్రం సినిమాల వైపు ఆసక్తి చూపెట్టడం లేదని ప్రచారం జరుగుతుంది. ఎందరో హీరో కావడానికి ఆరాటపడుతున్న ఈ రోజుల్లో మోక్షజ్ఞ కు ఫ్రీ పాస్ ఉన్నా ఆసక్తి చూపడం లేదు. ఈ విషయంలో బాలయ్యపై నందమూరి అభిమానాలు ఒత్తిడి చేస్తూ, నటనకు మోక్షజ్ఞను ఒప్పించాలని గట్టిగా కోరుకుంటున్నారట.


ప్రస్తుతం షూటింగ్స్ కి విరామం కావడంతో బాలయ్య ఈ విషయంపై దృష్టిపెట్టి మోక్షజ్ఞ కోసం కొత్త కథలు వింటున్నాడట. ఇకపోతే సాధారణంగా నటీనటుల వారసులు ఎవరైనా సరే 20 ఏళ్ళ వయసులోకి రాగానే జనాలను ఎట్రాక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. అయితే బాలయ్య తనయుడు మాత్రం ఇంకా జనాల ముందుకు రావడం లేదు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్న వంటి వారు చాలా ఫాస్ట్ గానే సిల్వర్ స్క్రీన్ కి ఎంట్రీ ఇచ్చారు..


ఈ క్రమంలో 2021 లో మోక్షజ్ఞ ఎంట్రీని కన్ఫర్మ్ చేయాలనేది బాలయ్య టార్గెట్ గా తెలుస్తుంది. బాలయ్య అనుకున్నట్లు జరిగితే స్వర్గీయ ఎన్టీఆర్ వారసుడిగా మరో యువరత్నం దిగుతుంది. మరి వచ్చే కొత్త సంవత్సరం అయినా, బాలయ్య కలను, అభిమానుల ఆశను నెరవేర్చుతుందో లేదో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: