ఇక రీసెంట్ గా స్టార్ హీరో అభిషేక్ బచ్చన్ తో వెబ్ సిరీస్ లో కూడా నటించింది నిత్యా. ‘బ్రీత్ ఇన్ టు ద షాడోస్’అన్న టైటిల్ తో వచ్చిన ఆ వెబ్ సిరీస్ తో కూడా బాగా పాపులారిటీ సాధించింది నిత్యా. అలాగే కాంట్రవర్సి కూడా అయింది. దాంతో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నిలిచింది. ప్రస్తుతం నిత్యా మీనన్ దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ఐరన్ లేడీ’ లో నటిస్తుంది. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయింది. లాక్ డౌన్ సమయంలో చాలా విషయాలు తెలుసుకుంది. వాటిలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను బయట పెట్టింది. అంతేకాదు కరోనా కారణంగా జీవితం పోరాటంగా మారిందని చెబుతోంది.
ఇక నిత్యా ఒకసారి ఒకే పనిమీద దృష్ఠి పెడతానని షూటింగ్కి వెళితే ఇంటి విషయాలు గుర్తు చేసుకోనని.. ఇంటికొస్తే షూటింగ్ గురించి ఆలోచించనని అంటోంది. అలా చేస్తే ప్రశాంతంగా ఉండలేనన్నది నిత్యా అభిప్రాయం. అంతేకాదు చేసే పనిలో తృప్తి ఉండదని చెబుతోంది. ఇక ఒక్కోసారి నేను పోషించిన పాత్రలు నా మనసును విపరీతంగా హత్తుకుంటాయని వెల్లడించింది. అంటే నిత్యా తను చేసే పాత్రలో అంతగా లీనమవుతుందని అర్థమవుతోంది. ఈ లాక్డౌన్ సమయం మన గురించి మనం తెలుసుకోవడానికి బాగా ఉపయోగపడిందని నిత్యా వెల్లడించింది.