నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సాయి ధరం తేజ్ కోసం ఆ కథని లాక్ చేశాడట రాం చరణ్. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఈ సినిమాకు సంబందించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత దేవా కట్టా డైరక్షన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాతో పాటుగా చరణ్ నిర్మించే సినిమా కూడా లైన్ లో పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో ఫాంలోకి వచ్చిన సాయి ధరం తేజ్ ఇకమీదట కథల విషయంలో తగిన జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. సోలో బ్రతుకే సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవా కట్టా సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా చేస్తుంది. ఇక రాం చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమాను 20 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించాలని అనుకుంటున్నాడట. ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు.. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి సమాచారం త్వరలో రివీల్ చేస్తారని తెలుస్తుంది.