మెగా పవర్ స్టార్ రాం చరణ్.. మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ ఇద్దరు కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తే. అబ్బో ఇంకేముందు మెగా ఫ్యాన్స్ కు పండుగే. రాం చరణ్, సాయి ధరం తేజ్ కలిసి సినిమాచేస్తారని అంటున్నారు. అయితే ఇద్దరు కలిసి చేసేది నిజమే అయినా రాం చరణ్ నిర్మాణంలో సాయి ధరం తేజ్ హీరోగా సినిమా వస్తుందని తెలుస్తుంది. చరణ్, సాయి ధరం తేజ్ మెగా ప్రాజెక్ట్ ను షురూ చేయబోతున్నారని తెలుస్తుంది.

నూతన దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో సాయి ధరం తేజ్ కోసం ఆ కథని లాక్ చేశాడట రాం చరణ్. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ ఇమేజ్ కు పర్ఫెక్ట్ గా సూటయ్యే ఈ సినిమాకు సంబందించి త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. సాయి ధరం తేజ్ ప్రస్తుతం సోలో బ్రతుకే సో బెటర్ సినిమా చేస్తున్నాడు.

సినిమా తర్వాత దేవా కట్టా డైరక్షన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాతో పాటుగా చరణ్ నిర్మించే సినిమా కూడా లైన్ లో పెట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది. చిత్రలహరి, ప్రతిరోజూ పండుగే సినిమాలతో ఫాంలోకి వచ్చిన సాయి ధరం తేజ్ ఇకమీదట కథల విషయంలో తగిన జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. సోలో బ్రతుకే సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుండగా దేవా కట్టా సినిమాలో నివేదా పేతురాజ్ హీరోయిన్ గా చేస్తుంది. ఇక రాం చరణ్ కూడా కొణిదెల ప్రొడక్షన్ లో సాయి ధరం తేజ్ సినిమాను 20 కోట్ల లోపు బడ్జెట్ తో నిర్మించాలని అనుకుంటున్నాడట. ఈ సినిమాకు డైరక్టర్ ఎవరు.. మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి సమాచారం త్వరలో రివీల్ చేస్తారని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: