కరోనా కారణంగా సినిమాలు వాయిదా పడ్డాయి. అలాగే సినిమా షూటింగులు లేక చిత్ర పరిశ్రమ బోసిపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాలు జోరు పెంచుతున్నాయి. ప్రభుత్వం సూచించిన నియమాలకు కట్టుబడి అవసరమైన వారినే సెట్ లో ఉంచి చిత్రీకరణ జరుపుకుంటున్నారు.ఇప్పటికే పలు సినిమాలు షూటింగ్ పనులను మొదలు పెట్టగా, పెద్ద సినిమాల ను వచ్చే నెల నుంచి షూటింగ్ మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. కాగా , మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ 'ప్రతిరోజు పండగే' సినిమాతో హిట్ టాక్ ను అందుకున్నాడు.
ఇటీవలే సుబ్బు దర్శకత్వంలో వచ్చిన ' సోలో బ్రతుకే సో బెటరు` సినిమాలో నటించాడు. లాక్ డౌన్ ముందు ప్రారంభమైన ఈ చిత్ర షూటింగ్ ను ఇటీవలే పూర్తి చేశారు. వచ్చే నెల నుంచి తన కొత్త సినిమా షూటింగ్ను ప్రారంభించబోతున్నాడు.`ప్రస్థానం` డైరెక్టర్ దేవకట్టాతో సాయితేజ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. వచ్చే నెల మూడో వారం నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని చిత్ర యూనిట్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.ఈ సినిమా ఫ్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి.. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా కథ ఉండబోతుంది.. ముందెన్నడూ లేనివిధంగా ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ కనిపిస్తాడని దర్శకుడు చెప్పుకొచ్చారు.ఈ చిత్రం మనోడికి ఏ మాత్రం హిట్ ఇస్తుందో చూడాలి.