యువ హీరోగా హిట్టు ఫ్లాపుల మధ్య సతమతమవుతున్న రాజ్ తరుణ్ ఈమధ్య ఒరేయ్ బుజ్జిగా సినిమా ఓటిటిలో రిలీజ్ చేశారు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. ఇక ఈ సినిమా తర్వాత రాజ్ తరుణ్ మరోసారి నాగార్జున ప్రొడక్షన్ లో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఒరేయ్ బుజ్జిగా ప్రమోషన్స్ లో భాగంగా రాజ్ తరుణ్ తన డైరక్షన్ ఇంట్రెస్ట్ ను బయటపెట్టాడు. ఎప్పటికైనా డైరక్షన్ చేస్తానని అంటున్నాడు రాజ్ తరుణ్.

షార్ట్ ఫిలిం తో కెరియర్ మొదలుపెట్టి ఆ తర్వాత అసిస్టెంట్ డైరక్టర్ గా చేరి ఉయ్యాల జంపాల సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు రాజ్ తరుణ్. డైరక్షన్ చేస్తే ఎవరిని డైరెక్ట్ చేస్తారని అడిగితే అల్లు అర్జున్, సునీల్ లను డైరెక్ట్ చేస్తా అంటున్నాడు రాజ్ తరుణ్. మరి వీరిద్దరినే స్పెసిఫిక్ గా ఎందుకు చెప్పాడో కాని ఆల్రెడీ రాజ్ తరుణ్ వీరి కోసం కథలు రాసినట్టు తెలుస్తుంది.

కుమారి 21ఎఫ్ సినిమాతో హిట్ అందుకున్న రాజ్ తరుణ్సినిమా తర్వాత తన కెరియర్ గ్రాఫ్ ఎక్కడికో వెళ్తుందని అనుకున్నారు. కాని ఆ సక్సెస్ ను సరిగా వాడుకోలేదు రాజ్ తరుణ్. ఇక తర్వాత కథల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వరుసగా సినిమాలు చేస్తూ ఫ్లాపులు అందుకున్నాడు. డైరక్టర్ గా రాజ్ తరుణ్ నిజంగా సత్తా చాటుతాడో లేదో చూడాలి. హీరోగా కొద్దిగా వెనుకపడితే డైరక్టర్ గా ఫిక్స్ అవుతాడేమో చూడాలి. రాజ్ తరుణ్ డైరక్షన్ చేస్తే అది ఎలా ఉంటుందో చూడాలి.                                                           

మరింత సమాచారం తెలుసుకోండి: