ఒరేయ్ బుజ్జిగా సినిమా తర్వాత రాజ్ తరుణ్ పరిస్థితి చాలా దారుణంగా తయారైందని చెప్పాలి.. ఈ సినిమా ఫ్లాప్ ఒక్కసారిగా అయన కెరీర్ ని చాలా డౌన్ లోకి తీసుకెళ్ళింది. ఒరేయ్ బుజ్జిగా సినిమా కు ముందు రాజ్ తరుణ్ తో సినిమా చేయాలనుకున్న నిర్మాతలు అందరు ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ అయిన తరువాత డ్రాప్ అవుతున్నారు.. అందుకు కారణం రాజ్ తరుణ్ కి మార్కెట్ చాలా బాగా పడిపోవడమే..  టాలీవుడ్ లో వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ లు అందుకున్న హీరో ఇక టాప్ రేంజ్ కి వెళ్లడం ఖాయం అనుకున్నారు కానీ రాజ్ తరుణ్ విషయంలో మాత్రం అందరి అంచనాలు తారుమారు అయ్యాయి..

వచ్చిన హిట్ ని సద్వినియోగం చేసుకోలేక చెత్త సినిమాలు చేసి వచ్చిన స్టార్ డమ్ ని చేజేతులా పోయేలా చేసుకున్నాడు.. ఇక తాజాగా అయన  చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.  ఓ ఇంటర్వ్యూ లో రాజ్ తరుణ్ తాను డైరెక్టర్ కాబోయి హీరో అయ్యా అని కానీ ఎప్పటికైనా డైరెక్టర్ అవతారమెత్తుతా అంటున్నాడు. అయితే ఇప్పటికే తాను ఇద్దరు హీరోలని దృష్టిలో ఉంచుకుని కథలు రాసుకున్న అని అది ఒకటి అల్లు అర్జున్ ని మదిలో పెట్టుకుని ఆయనకున్ సరిపోయే కథ రాసుకున్న అంటున్నాడు.

తర్వాత సునీల్ హీరోగా ఓ సినిమా కథ తయారు చేశా అంటున్నాడు. కథ రాసుకునేటప్పుడే హీరోలను దృష్టిలో పెట్టుకుని కథ రాస్తామని చెబుతున్నాడు రాజ్ తరుణ్. అయితే బన్నీతో సినిమా చేస్తానో లేదో అనే నిరాశతో మాట్లాడుతున్నాడు. మరి సునీల్ కథతో నిర్మాత దొరికితే రాజ్ తరుణ్ డైరెక్టర్ అవతారమెత్తినా ఎత్తొచ్చు. కానీ బన్నీ రాజ్ తరుణ్ కి దొరకాలంటే కాస్త కష్టమే. మరి బన్నీ తో రాజ్ తరుణ్ సినిమా చెయ్యాలనే కల నెరవేరుతుందో లేదంటే రాజ్ తరుణ్ చెప్పినట్టుగా చేయలేడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: