యువ హీరో నితిన్ ఈ ఇయర్ మొదట్లో భీష్మ హిట్ తో మళ్ళీ ఫాం లోకి వచ్చినట్టే అని చెప్పొచ్చు. శ్రీనివాస కళ్యాణం తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న నితిన్ భీష్మతో తిరిగ్ ట్రాక్ లోకి వచ్చాడు. భీష్మ తర్వాత నితిన్ చేస్తున్న క్రేజీ సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

ఇక ఈ సినిమాతో పాటుగా చంద్రశేఖర్ యేలేటి చెక్ సినిమా కూడా సెట్స్ మీద ఉంది. ఈ సినిమా తర్వాత అందాదున్ రీమేక్ కూడా చేస్తున్నాడు నితిన్. ఇదిలాఉంటే నితిన్ కృష్ణ చైతన్య డైరక్షన్ లో పవర్ పేట సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుంది. పిరియాడికల్ మూవీగా వస్తున్న ఈ సినిమా రెండు భాగాలుగా చేస్తున్నారని తెలుస్తుంది. సినిమాకు భారీ బడ్జెట్ తో పాటుగా స్టార్ కాస్ట్ ను అదే రేంజ్ లో తీసుకుంటున్నారట. నితిన్ కెరియర్ లో హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా పవర్ పేట వస్తుంది.

ఈ సినిమాను ఫిబ్రవరి నుండి సెట్స్ మీదకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు చిత్రయూనిట్. సినిమాలో నితిన్ రకరకాల వేరియేషన్స్, ఏజ్ గ్రూపులున్న పాత్రలో కనిపిస్తాడని తెలుస్తుంది. ఈ సినిమాలో నితిన్ అందరిని సర్ ప్రైజ్ చేస్తాడట. అందుకే కమిటైన సినిమాలన్ని పూర్తి చేసి పవర్ పేట మీద ఫోకస్ పెట్టాలని చూస్తున్నాడు. ఆ సినిమా కోసం నితిన్ భారీ వర్క్ అవుట్స్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. మొత్తానికి నితిన్ కూడా సరైన ట్రాక్ లో ఉన్నాడని చెప్పొచ్చు.                                             

మరింత సమాచారం తెలుసుకోండి: