రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసి ఆ తర్వాత వర్షం సినిమాతో పెద్ద కమర్షియల్ సక్సెస్ ను అందుకున్నారు. ఆపై రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చత్రపతి, మెహర్ రమేష్ తీసిన బిల్లా, దశరథ్ దర్శకత్వంలో తెరకెక్కిన మిస్టర్ పర్ఫెక్ట్, పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన బుజ్జిగాడు అలానే కరుణాకరన్ తీసిన డార్లింగ్, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మిర్చి సినిమాలతో భారీ విజయాలు అందుకుని హీరోగా టాలీవుడ్ లో మంచి క్రేజ్ దక్కించుకున్నారు ప్రభాస్.

అయితే ఇటీవల రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన బాహుబలి సిరీస్ లోని రెండు సినిమాలు ఒకదానిని మించి మరొకటి అత్యద్భుత విజయాన్ని అందుకొని దేశవిదేశాల్లో కూడా హీరో ప్రభాస్ కు విపరీతమైన క్రేజ్ ని మార్కెట్ ని తెచ్చిపెట్టాయి. వాటి అనంతరం ప్రభాస్ నటించిన సినిమా సాహో. గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ గా నిలిచినప్పటికీ ఇతర భాషల్లో మాత్రం కలెక్షన్ల రికార్డులు సృష్టించింది. ఇకపోతే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా రాధేశ్యామ్ కొన్నేళ్ళ క్రితం యూరప్ లో జరిగిన యదార్థ ప్రేమ కథకు రూపంగా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అతి త్వరలో దీని అనంతరం నాగ అశ్విన్ సినిమా తో పాటు ఓం రౌత్ దర్శకత్వంలో ఆదిపురుష్ సినిమా చేయనున్నారు ప్రభాస్.

అయితే ఇప్పటి వరకు కూడా ప్రేక్షకుల మన్ననలు అలానే కలెక్షన్ల రికార్డులు, రివార్డులు అందుకున్న ప్రభాస్ ఇకపై రాబోయే సినిమాలతో అవార్డు ల పై కూడా గట్టిగా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. రాధేశ్యామ్ మూవీ రెట్రో లవ్ స్టోరీ గా తెరకెక్కుతుండగా, నాగ అశ్విన్ సినిమా సైన్స్ ఫిక్షన్ జానర్ లోను అలానే ఆదిపురుష్ సినిమా హిస్టారికల్ జానర్ లోను తెరకెక్కుతుండడంతో తప్పనిసరిగా ఈ సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ అందుకోవడం తో పాటు ప్రభాస్ కి ఇవి అవార్డులు కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉందని అంటున్నారు. మరి అదే గనుక జరిగితే ఇక అన్ని విషయాల్లో ప్రభాస్ ని అందుకోవటం మిగతా హీరోలకు మరింత కష్టం అవుతుందని అంటున్నారు విశ్లేషకులు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: