స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతాఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు నిర్మించిన ప్రతిష్టాత్మక సినిమా అలవైకుంఠపురములో. రెండవ సారి పూజా హెగ్డే అల్లు అర్జున్ కు జోడీగా నటించిన ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతిపెద్ద విజయాన్ని అందుకుంది. కాగా ఈ సినిమాకి పి.ఎస్.వినోద్ ఫోటోగ్రఫీ అందించగా యువ సంగీత తరంగం తమన్ మ్యూజిక్ అందించాడు.

ఇకపోతే ఇందులోని సాంగ్స్ ఎంత అద్భుత విజయాన్ని అందుకున్నాయో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఈ సినిమాలోని బుట్ట బొమ్మ, సామజవరగమన, రాములో రాముల సాంగ్స్ అయితే జాతీయస్థాయిలో గొప్ప పేరు దక్కించుకొని ప్రస్తుతం యూట్యూబ్లో వందల మిలియన్ల కొద్దీ వ్యూస్ తో కొనసాగుతున్నాయి. మరోవైపు యువతతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఈ పాటలకు ఎంతో కనెక్ట్ అవుతూ వీటికి మరింత ఆదరణ కనబరుస్తున్నారు. ఇక అసలు మ్యాటర్ ఏమిటంటే ఈ సినిమాలోని బుట్ట బొమ్మ సాంగ్ లిరికల్ పరంగా అలానే వీడియో సాంగ్ పరంగా ఇప్పటికే భారీ విజయం సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

ఇక నేడు బుట్ట బొమ్మ వీడియో సాంగ్ ఏకంగా 450 మిలియన్ లకు పైగా వ్యూస్ తో పాటు 3 మిలియన్ లకు పైగా లైక్స్ ను దక్కించుకొని సరికొత్త సంచలన రికార్డు నమోదు చేసింది. ఈ విధంగా ఒక టాలీవుడ్ సినిమా సాంగ్ ఇంత వేగవంతంగా వ్యూస్ తో పాటు లైక్స్ ని ఈ రేంజిలో దక్కించుకోవడం అత్యద్భుతమైన విషయమని ఈ రేర్ ఫీట్ అందుకున్న అలవైకుంఠపురములో యూనిట్ కి ముఖ్యంగా హీరో అల్లు అర్జున్ దర్శకుడు త్రివిక్రమ్ సంగీత దర్శకుడు తమన్ లకు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ తమ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఈ న్యూస్ ని మరింతగా వైరల్ చేస్తున్నారు....!!



మరింత సమాచారం తెలుసుకోండి: