ఇక అప్పటినుండి బాహుబలి నటించబోతున్న ఈ సినిమాపై రోజుకో వార్త పుట్టుకు వస్తూనే ఉంది. పాన్ ఇండియా సూపర్ స్టార్ సినిమా అంటే ఆ మాత్రం ఆసక్తి ఉండడంలో ఆశ్చర్యం లేదు. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి భారీగానే సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో డార్లింగ్ ప్రభాస్ పక్కన నటించబోయే హీరోయిన్ ఎవరనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ సినిమాలో కథ ప్రకారం ఇద్దరు హీరోయిన్లకు చోటు ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. ఆ ఇద్దరు హీరోయిన్లు వీరే అంటూ పలు కథనాలు వినిపిస్తున్నాయి. సలార్ ఫ్యాన్ ఇండియా సినిమా అయినందున.... అన్ని భాషల ప్రేక్షకులను ఆకర్షించేందుకు అనుగుణంగా ఉండే హీరోయిన్లను వెతికే పనిలో పడింది చిత్రబృందం.
ఇప్పటికే ఇద్దరు కథానాయికలను సెలెక్ట్ చేసి సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. అందులో ప్రథమంగా బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ పేరు గట్టిగా వినిపిస్తోంది. ప్రభాస్ సరసన ప్రధాన కథానాయికగా ఈ ముద్దుగుమ్మ నటించనుందట. అదేవిధంగా మరో లీడ్ రోల్ కోసం సారా అలీఖాన్ అయితే సరిగ్గా సూటవుతుందని దర్శకుడు భావిస్తున్నారట. కాగా సారా అలీఖాన్ ని ఈ చిత్రంలో సెకండ్ లీడ్ రోల్ కోసం తీసుకునే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత ఉందో తెలుసుకోవాలంటే మరికొద్ది రోజులు అధికారిక ప్రకటన కోసం ఆగాల్సిందే. ప్రస్తుతం కే జి ఎఫ్ సీక్వెల్ను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నారు ప్రశాంత్ నీల్. ఇటు ప్రభాస్ కూడా రాధేశ్యామ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా వీరి ప్రాజెక్టులు పూర్తి చేసుకొని వెంటనే....2021 మొదటి నెల అనగా జనవరిలో "సలార్" చిత్రాన్ని ప్రారంభించనున్నారు. అందుకోసం ముందుగా పూర్తి కావాల్సిన పనులన్నీ చకచకా జరుగుతున్నాయి.